తిరుపతిలో వైభవంగా ప్రారంభమైన గోవిందరాజస్వామి జ్యేష్ఠాభిషేకం

ABN, Publish Date - Jul 07 , 2025 | 09:40 AM

తిరుపతిలోని గోవింద రాజస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ఈ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఆషాఢ మాసంలో తిరుపతిలోని గోవింద రాజస్వామి వారికి జ్వేష్ఠాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

తిరుపతిలో వైభవంగా ప్రారంభమైన గోవిందరాజస్వామి జ్యేష్ఠాభిషేకం 1/8

తిరుపతిలోని గోవింద రాజస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

తిరుపతిలో వైభవంగా ప్రారంభమైన గోవిందరాజస్వామి జ్యేష్ఠాభిషేకం 2/8

ఆదివారం ఈ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

తిరుపతిలో వైభవంగా ప్రారంభమైన గోవిందరాజస్వామి జ్యేష్ఠాభిషేకం 3/8

ప్రతి ఆషాఢ మాసంలో తిరుపతిలోని గోవింద రాజస్వామి వారికి జ్వేష్ఠాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

తిరుపతిలో వైభవంగా ప్రారంభమైన గోవిందరాజస్వామి జ్యేష్ఠాభిషేకం 4/8

ఇందులో భాగంగా ఆదివారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి కైంకర్యాలు శతకలశ స్నపనం, మహాశాంతి హోమం చేపట్టారు.

తిరుపతిలో వైభవంగా ప్రారంభమైన గోవిందరాజస్వామి జ్యేష్ఠాభిషేకం 5/8

ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత గోవింద రాజస్వామి వారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.

తిరుపతిలో వైభవంగా ప్రారంభమైన గోవిందరాజస్వామి జ్యేష్ఠాభిషేకం 6/8

పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు.

తిరుపతిలో వైభవంగా ప్రారంభమైన గోవిందరాజస్వామి జ్యేష్ఠాభిషేకం 7/8

అనంతరం స్వామి వారి కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కవచాధివాసం చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి వారు తిరుచ్చిపై ఆలయంలోని నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు.

తిరుపతిలో వైభవంగా ప్రారంభమైన గోవిందరాజస్వామి జ్యేష్ఠాభిషేకం 8/8

ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో వీఆర్ శాంతి, ఏఈవో మునికృష్ణారెడ్డి, అర్చకులు, తదితర అధికారులు పాల్గొన్నారు.

Updated at - Jul 07 , 2025 | 09:45 AM