తిరుపతిలో వైభవంగా ప్రారంభమైన గోవిందరాజస్వామి జ్యేష్ఠాభిషేకం
ABN, Publish Date - Jul 07 , 2025 | 09:40 AM
తిరుపతిలోని గోవింద రాజస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ఈ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఆషాఢ మాసంలో తిరుపతిలోని గోవింద రాజస్వామి వారికి జ్వేష్ఠాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

తిరుపతిలోని గోవింద రాజస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

ఆదివారం ఈ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

ప్రతి ఆషాఢ మాసంలో తిరుపతిలోని గోవింద రాజస్వామి వారికి జ్వేష్ఠాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగా ఆదివారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి కైంకర్యాలు శతకలశ స్నపనం, మహాశాంతి హోమం చేపట్టారు.

ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత గోవింద రాజస్వామి వారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.

పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు.

అనంతరం స్వామి వారి కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కవచాధివాసం చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి వారు తిరుచ్చిపై ఆలయంలోని నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు.

ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో వీఆర్ శాంతి, ఏఈవో మునికృష్ణారెడ్డి, అర్చకులు, తదితర అధికారులు పాల్గొన్నారు.
Updated at - Jul 07 , 2025 | 09:45 AM