Sai Mandir USA: డా. దత్తాత్రేయుడు నోరి అధ్వర్యంలో ఘనంగా బాబా గుడి 25వ వార్షికోత్సవం
ABN , Publish Date - Jun 04 , 2025 | 10:38 AM
Sai Mandir USA: 25 ఏళ్లుగా ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు. అమెరికాలో తొలి సాయి బాబా గుడిని డాక్టర్ దత్తాత్రేయ నిర్మించటం విశేషం. ఇక, ఈ కార్యక్రమం దిగ్విజయం అవ్వటంలో కిరణ్ పర్వతాల కృషి ఎంతో ఉంది.

అమెరికా: న్యూయార్క్లోని సాయి బాబా గుడి 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గత శనివారం హిక్స్విల్లే మిడిల్ స్కూల్లో జరిగిన ఈ వేడుకల్లో అతిథులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 750 మందికిపైగా భక్తులు ఈ కార్యక్రమానికి వచ్చారు. కళారత్నపారుపల్లి శ్రీరంగనాథ్, సింగర్ సునీత, కౌన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా బినయా ఎస్. ప్రధాన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి.
మహేశ్వరి యూత్ పర్ఫార్మెన్స్ ఇవ్వగా.. అశోక్ చింతకుంట బాబా జీవతంపై ఓ నాటకాన్ని ప్రదర్శించారు. సాధనా పరాంజి క్లాసికల్ డ్యాన్స్ వేశారు. సాయి బాబా గుడి 25వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా.. గుడిని నిర్మించిన డాక్టర్ దత్తాత్రేయ నోరిని పలువురు సంఘ పెద్దలు, ముఖ్య అతిథులు ప్రత్యేకంగా ప్రశంసించారు. 25 ఏళ్లుగా ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు. అమెరికాలో తొలి సాయి బాబా గుడిని డాక్టర్ దత్తాత్రేయుడు నిర్మించటం విశేషం. ఇక, ఈ కార్యక్రమం దిగ్విజయం అవ్వటంలో కిరణ్ పర్వతాల కృషి ఎంతో ఉంది.
న్యూయార్క్ కోర్ టీమ్ సభ్యులు, వాలంటీర్లు కూడా ఎంతో కష్టపడ్డారు. కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం కలుగకుండా ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ పార్కింగ్ కల్పించారు. ఎంతో భక్తి , శ్రద్దలతో కార్యక్రమం ముగిసింది. కార్యక్రమం చివర్లో అన్న ప్రసాద వితరణ జరిగింది.
ఇవి కూడా చదవండి
రీల్స్ చేస్తుండగా విషాదం.. ఆరుగురు అమ్మాయిలు మృతి
ప్రియురాలితో గొడవ.. ఇదేం పని నాయనా..