రాజీవ నేత్రాయ రాఘవాయ
ABN , Publish Date - May 30 , 2025 | 05:19 AM
15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు రాసిన సంకీర్తనలు ఈ నాటికి మన తెలుగునాట మారుమ్రోగుతూ ఉంటాయి. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ ఆయన రాసిన సంకీర్తనలు విశిష్టమైనవి....

వ్యాసపీఠం
15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు రాసిన సంకీర్తనలు ఈ నాటికి మన తెలుగునాట మారుమ్రోగుతూ ఉంటాయి. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ ఆయన రాసిన సంకీర్తనలు విశిష్టమైనవి. తన 16వ ఏట సంకీర్తనా రచనను ప్రారంభించిన అన్నమయ్య రోజుకు ఒక సంకీర్తన చొప్పున 32 వేల సంకీర్తనలు రాశాడని ప్రతీతి. దీని వెనక కూడా ఒక కథ ఉంది. మొదట్లో స్మార్త బ్రాహ్మణుడైన అన్నమయ్య... ఆదివన్ శఠకోపయతి అనే గురువు వల్ల శ్రీవైష్ణువునిగా మారాడని, సుప్రసిద్ద నారసింహ క్షేత్రమైన అహోబిలంలో వేదాంత విద్యను అభ్యసించాడని చెబుతారు. నృసింహమంత్రంలోని 32 బీజాక్షరాలకు సంకేతంగా 32 వేల సంకీర్తనలు రాశాడని ప్రతీతి. ఈ కీర్తనలలో కొన్నింటి తాత్పర్యాన్ని ప్రముఖ వ్యాఖ్యాత వెంకట్ గరికపాటి - ‘రాజీవ నేత్రాయ.. రాఘవాయ’ అనే పేరిట పుస్తక రూపంలోకి తీసుకువచ్చారు. అన్నమయ్య కీర్తనలపై ఆసక్తి ఉన్నవారందరూ తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకమిది.
రాజీవ నేత్రాయ.. రాఘవాయ
రచయిత: వెంకట్ గరికపాటి
ప్రతులకు: 9704179950
ఇవి కూడా చదవండి
పాకిస్తాన్ టూర్.. బయ్యా సన్నీ యాదవ్ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
ముగ్గురు భార్యల ముద్దుల మొగుడు.. మూడు ఫ్యామిలీలను పోషించలేక..