సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల
ABN , Publish Date - Jun 12 , 2025 | 05:46 AM
అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి మే 25న నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష-2025 ఫలితాలను బుధవారం యూపీఎస్సీ వెల్లడించింది.

హైదరాబాద్ సిటీ, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి మే 25న నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష-2025 ఫలితాలను బుధవారం యూపీఎస్సీ వెల్లడించింది. సివిల్స్ మెయిన్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నంబర్లతో కూడిన జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పరీక్షకు 74,427 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 42,804 మంది పరీక్షకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన 14,161 మందిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల సంఖ్య 450 నుంచి 500 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. సివిల్స్ మెయిన్ పరీక్షలు దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో ఆగస్టు 22 నుంచి 5 రోజుల పాటు జరగనున్నాయి.