Operation Sindoor: యుద్ధం అంటే యుద్ధమే.. చిన్నా పెద్దా ఏమిటి?.. ఖర్గేకు కూటమి నేత కౌంటర్
ABN , Publish Date - May 21 , 2025 | 02:43 PM
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులను కాల్చిచంపినందుకు ప్రతిగా భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ను చేపట్టడం ఒక భారతీయురాలిగా గర్వస్తున్నానని సుప్రియా సూలే ప్రశంసించారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.

ముంబై: పాకిస్థాన్పై ఇండియా మిలటరీ చర్యను 'చిన్న యుద్ధం' అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై 'ఇండియా' కూటమి భాగస్వామ్య పార్టీ ఎన్సీపీ (ఎస్పీ) నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఉగ్రవాదంపై పోరు విషయానికి వచ్చేసరికి యుద్ధం పెద్దదా చిన్నాదా అనేది ఉండదని ఆ పార్టీ నేత, లోక్సభ ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule) వ్యాఖ్యానించారు. "యుద్ధం అంటే యుద్ధమే, అతి పెద్దది కావచ్చు చిన్నది కావచ్చు. ఈ యుద్ధం ఉగ్రవాదంపై జరిపిన యుద్ధం. ఈ అంశాన్ని రాజకీయం చేయకూడదని, ఇలాంటి సున్నితమైన అంశంపై ఒకరినొకరు విమర్శించుకోరాదని అఖిల పక్ష సమావేశంలో మేము సమష్టిగా నిర్ణయం తీసుకున్నాం'' అని ఆమె తెలిపారు.
Professor Ali Khan: అశోక వర్శిటీ ప్రొ. అలీఖాన్కు బెయిల్.. సిట్కు సుప్రీం అనుమతి
100కి 1000 మార్కులు
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులను కాల్చిచంపినందుకు ప్రతిగా భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ను చేపట్టడం ఒక భారతీయురాలిగా గర్వస్తున్నానని సుప్రియా సూలే ప్రశంసించారు. ''ఆపరేషన్ సింధూర్కు కేవలం 100కి 100 మార్కులు ఇవ్వడం లేదు, 100కి 1000 మార్కులు ఇస్తున్నాను. మన సాయుధ బలగాలు ఈ ప్రశంసకు పరిపూర్ణంగా అర్హులు'' అని అన్నారు.
ఖర్గేపై మండిపడిన కర్ణాటక బీజేపీ
దీనికి ముందు, ఖర్గే వ్యాఖ్యలను కర్ణాటక బీజేపీ తప్పుపట్టింది. బాధ్యతలులేని వ్యాఖ్యలు చేశారని, మన సాయిధ బలగాల ధైర్యసాహసాలను కించపరచారని విమర్శించింది. మన సైనికుల త్యాగాలను తక్కువ చేసి మాట్లాడటం తగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర అన్నారు. ఇండియాను ఎప్పుడూ చిక్కుల్లో పెట్టాలని పాక్ అనుకుంటుందని, వాళ్లు బలహీనులు కావడంతో చైనా మద్దతుతో మనపై దాడి చేసే ప్రయత్నం చేశారని అన్నారు. ఇలాంటి చర్యలను మనదేశం సహించి ఊరుకోదని, ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Sonia andhi-Rahul Gandhi: చిక్కుల్లో సోనియా-రాహుల్.. ఈడీ సంచలన ఆరోపణలు..
Police Encounter: ఎన్కౌంటర్లో గ్యాంగస్టర్ సభ్యుడికి గాయాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి