Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మృతి
ABN , Publish Date - Nov 13 , 2025 | 08:58 PM
మహారాష్ట్రలో పుణే - బెంగళూరు జాతీయ రహదారిలోని నవలే వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కంటైనర్ ట్రక్.. ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీ కొట్టంది.
ముంబై, నవంబర్ 13: మహారాష్ట్రలో పుణే - బెంగళూరు జాతీయ రహదారిలోని నవలే వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కంటైనర్ ట్రక్.. ఎదురుగా వస్తున్న వాహనాలను వేగంగా ఢీ కొట్టంది. ఆ వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
అదే రహదారిపై వెళ్లున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. అనంతరం క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అత్యధిక వేగంతో వస్తున్న కంటైనర్ ట్రక్.. నియంత్రణ కోల్పోయిందని పోలీసులు తెలిపారు. అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ప్రమాదంలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు.. రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లోకేశ్ ఆసక్తికర ట్విట్.. యువతలో తీవ్ర చర్చ
For More National News And Telugu News