Share News

PM Kisan: రేపు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..!

ABN , Publish Date - Jul 17 , 2025 | 06:11 AM

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన 20వ విడత నిధులను ప్రధాని మోదీ శుక్రవారం బిహార్‌లో జరగనున్న భారీ బహిరంగ సభలో విడుదల చేసే అవకాశముందని ఓ జాతీయ వార్తా సంస్థ నివేదిక పేర్కొంది.

PM Kisan: రేపు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..!
PM Kisan Nidhi Yojana

న్యూఢిల్లీ, జూలై 16: పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన 20వ విడత నిధులను ప్రధాని మోదీ శుక్రవారం బిహార్‌లో జరగనున్న భారీ బహిరంగ సభలో విడుదల చేసే అవకాశముందని ఓ జాతీయ వార్తా సంస్థ నివేదిక పేర్కొంది. పీఎం కిసాన్‌ నిధులను ప్రతి నాలుగు నెలలకోసారి విడుదల చేస్తారు. చివర 19వ విడత నిధులను 2025 ఫిబ్రవరిలో విడుదల చేశారు. గతేడాది జూన్‌ వాయిదాను నెల ముగియక ముందే విడుదల చేశారు. అయితే ఈ సారి నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. పీఎం కిసాన్‌ ద్వారా దేశవ్యాప్తంగా 9.8 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది.

Updated Date - Jul 17 , 2025 | 10:27 AM