Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. ఈ రాష్ట్రాల్లో మాక్ డ్రిల్
ABN , Publish Date - May 28 , 2025 | 04:57 PM
Operation Sindoor: మాక్ డ్రిల్స్ మళ్లీ మొదలవ్వనున్నాయి. గురువారం పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న నాలుగు జిల్లాల్లో మాక్ డ్రిల్స్ జరగనున్నాయి. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూకాశ్మీర్లలో అధికారులు సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదులకు, వారికి సాయం చేస్తున్న పాకిస్తాన్కు సరైన విధంగా బుద్ధి చెప్పడానికి భారత ప్రభుత్వం సిద్ధమైంది. భారత ప్రజలకు యుద్ధం జరగొచ్చంటూ హింట్ ఇచ్చేసింది. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించింది. ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదుల ఏరివేత మొదలెట్టింది. మే 7వ తేదీన పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై ఎయిర్ఫోర్స్ దాడులు చేసింది. దాదాపు 100 మందికిపైగా ఉగ్రవాదులు చనిపోయారు.
ఉగ్రవాదుల్ని చంపటంతో పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది. యుద్ధానికి కాలు దువ్వింది. 3 రోజుల పాటు యుద్ధం జరిగింది. రెండు దేశాల మధ్య జరిగిన ఈ యుద్ధంలో పాక్ దారుణంగా దెబ్బతింది. చివరకు కాళ్ల బేరానికి వచ్చింది. యుద్ధం ఆగినా.. రెండు దేశాల మధ్య పరిస్థితులు మాత్రం నివురుగప్పిన నిప్పులాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మాక్ డ్రిల్స్ మళ్లీ మొదలవ్వనున్నాయి. గురువారం పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న నాలుగు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ జరగనున్నాయి. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూకాశ్మీర్లలో అధికారులు సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు.
హర్యానా ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ‘ ఆపరేషన్ షీల్డ్’ పేరిట మాక్ డ్రిల్స్ నిర్వహించనుంది. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి మాక్ డ్రిల్ మొదలవుతుంది. మొత్తం 22 జిల్లాల్లో అధికారులు మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. ఎమర్జెన్సీ పరిస్థితులకు సిద్ధంగా ఉండటం కోసం ఈ మాక్ డ్రిల్స్ జరగనున్నాయి. హర్యానాలోని కీలక ప్రాంతాల్లో రాత్రి 8 గంటల సమయంలో 15 నిమిషాల పాటు బ్లాక్ అవుట్ ఉండనుంది. విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో నిలిచిపోనుంది. అయితే, హాస్పిటల్స్, ఫైర్ స్టేషన్స్, పోలీస్ స్టేషన్స్కు ఇందులో మినహాయింపు ఉంది.
ఇవి కూడా చదవండి
రైతులకు కేంద్రం గుడ్న్యూస్.. వరి మద్దతు ధర పెంపు..
బాస్మతి రైస్ ప్యాకెట్తో జాకెట్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..