Share News

Mallikarjun Kharge: సీడీఎస్ ఒప్పుకోలు.. రక్షణ సన్నద్ధతపై నిపుణల కమిటీతో సమీక్షకు కాంగ్రెస్ డిమాండ్

ABN , Publish Date - May 31 , 2025 | 10:01 PM

మన సైనికుల ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నానని, అయితే మన రక్షణ సన్నద్ధతపై నిపుణుల కమిటీతో తక్షణం ఒక సమగ్ర వ్యూహాత్మక సమీక్ష జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఖర్గే అన్నారు.

Mallikarjun Kharge: సీడీఎస్ ఒప్పుకోలు.. రక్షణ సన్నద్ధతపై నిపుణల కమిటీతో సమీక్షకు కాంగ్రెస్ డిమాండ్

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌తో ఇటీవల జరిగిన ఘర్షణల్లో కొన్ని యుద్ధ విమానాలను కోల్పోవడం నిజమేనని సీడీఎస్ అనిల్ చౌహాన్ అంగీకరించిన కొద్ది గంటలకే కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్రం దేశాన్ని తప్పుదారి పట్టిస్తోందని, దీంతో అనేక ప్రశ్నలు తలెత్తున్నాయని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Khage) అన్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తేనే వీటిని వెంటనే పార్లమెంటులో ప్రస్తావించగలమని అన్నారు.


పాక్‌తో ఘర్షణల్లో భారత వాయుసేనకు కొన్ని సవాళ్లు ఎదురయ్యాయని, ఈ క్రమంలో కొంత నష్టం ఏర్పడిన మాట వాస్తవమేనని సీడీఎస్ ఒప్పుకున్నట్టు ఖర్గే పేర్కొన్నారు. మన సైనికుల ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నానని, అయితే మన రక్షణ సన్నద్ధతపై నిపుణుల కమిటీతో తక్షణం ఒక సమగ్ర వ్యూహాత్మక సమీక్ష జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఖర్గే అన్నారు. కార్గిల్ రివ్యూ కమిటీ తరహాలో ఒక స్వతంత్ర నిపుణుల కమిటీతో ఈ సమీక్ష జరిపించాలని డిమాండ్ చేశారు.


సీడీఎస్ ఏమన్నారు

దీనికి ముందు సింగపూర్‌లో జరుగుతున్న షాంగ్రీ-లా డైలాగ్‌లో సీడీఎస్ అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధ విమానం కూలిపోవడం ముఖ్యం కాదని, అలా ఎందుకు జరిగిందో తెలుసుకోవడం ముఖ్యమని అన్నారు. జరిగిన వ్యూహాత్మక తప్పిదాలను గుర్తించి, వాటిని సరిదిద్దుకుని రెండు రోజుల్లోనే శత్రుమూకలపై విరుచుకుపడ్డామన్నారు. ఆరు జెట్లు కూల్చేసినట్టు పాక్ చెబుతున్న దాంట్లో నిజం లేదన్నారు.


ఇవి కూడా చదవండి..

జాతీయ వీరత్వానికి చిహ్నంగా సింధూరం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

భారత్- పాక్ యుద్ధంలో ఫైటర్ జెట్లు కోల్పోయాం.. సీడీఎస్ వెల్లడి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 31 , 2025 | 10:01 PM