Operation Sindoor: పాకిస్తాన్పై ద్వైపాక్షిక ఒత్తిడికి సిద్ధమైన కేంద్రం
ABN , Publish Date - May 13 , 2025 | 10:25 AM
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్కు అన్ని విధాలా దెబ్బ తీసిన ఇండియా... ఇప్పుడు ద్వైపాక్షిక ఒత్తిడికి సిద్ధమైంది. విదేశాంగ మంత్రి, విదేశాంగ శాఖ కార్యదర్శి, పలువురు ఉన్నతాధికారులు పలు దేశాల ప్రతినిధులతో భేటీ కానున్నట్లు సమాచారం. అలాగే విదేశాంగ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులకు కూడా కేంద్రం వివరాలు ఇవ్వనుంది.

Operation Sindoor: పాకిస్తాన్ (Pakistan)పై ద్వైపాక్షిక ఒత్తిడికి (Pakistan) కేంద్రం సిద్ధమైంది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పేరుతో పాకిస్తాన్ను భారత్ (India) అన్నివిధాలా దెబ్బతీసింది. ఇప్పుడు మరో కోణంలో కూడా ఒత్తిడికి కేంద్రం సిద్ధమైంది. దేశంలో అందుబాటులో ఉన్న అన్ని దేశాల అంబాసిడర్లు (Ambassadors), ముఖ్యమైన అధికారులకు (Important Officials) ఆపరేషన్ సిందూర్ వివరాలు పంచుకోనున్నట్లు సమాచారం. ఉగ్రవాద నిర్మూలనలో వేసిన ముందడుగు, చోటుచేసుకున్న పరిణామాలు వివరాలు అందించనున్నట్లు తెలియవచ్చింది. మిలిటరీ చర్యకు కారణాలు చెప్పి.. మద్దతు కొనసాగించాలని కొరనున్నట్లు సమాచారం.
19న సమావేశం..
విదేశాంగ మంత్రి, విదేశాంగ శాఖ కార్యదర్శి, పలువురు ఉన్నతాధికారులు పలు దేశాల ప్రతినిధులతో భేటీ కానున్నట్లు తెలియవచ్చింది. మరోవైపు విదేశాంగ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులకు కూడా కేంద్రం వివరాలు ఇవ్వనుంది. ఈనెల 19న కమిటీ ఛైర్మన్ శశిథరూర్ నేతృత్వంలో జరిగనున్న సమావేశంలో విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఆపరేషన్ సిందూర్ విషయాలు చెప్పనున్నారు.
కశ్మీర్లో ప్రశాంత పరిస్థితులను భగ్నం చేసి..
కాగా భారత్–పాకిస్థాన్ తాజా యుద్ధస్థితి ఉభయ దేశాల భావి సంబంధాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు. ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద దాడి యావద్భారతీయులను అమితంగా కలచివేసింది. ఆ హతులు అందరూ ఆసేతు హిమాచలంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు. కశ్మీర్లో ప్రశాంత పరిస్థితులను భగ్నం చేసి, ఆ కేంద్ర పాలిత ప్రాంత పర్యాటక రంగ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసే కుతంత్రంతో జరిగిన ఉగ్రవాద దాడిపై సమస్త భారతీయుల ఆగ్రహావేశాలు, భావోద్వేగాలలో కేంద్ర ప్రభుత్వమూ పాలుపంచుకుంది.
Also Read: TGCSB:సైబర్ నేరస్తుల కోసం స్పెషల్ ఆపరేషన్
ఆపరేషన్ సిందూర్...
మే 7 ప్రాతఃకాలంలో ఆపరేషన్ సిందూర్ పేరిట ఎంపిక చేసుకున్న తొమ్మిది ప్రదేశాల పాకిస్థాన్లో నాలుగు, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఐదు)లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత వాయుసేన క్షిపణి దాడులు నిర్వహించింది. పహల్గాం ఊచకోత అనంతరం పాకిస్థాన్ సాయుధ బలగాలు అప్రమత్తంగా ఉన్నప్పటికీ మన సైనిక దళాలు ఎంచుకున్న నిర్దిష్ట లక్ష్యాలను కచ్చితంగా ధ్వంసం చేయడంలో సంపూర్ణంగా సఫలమయ్యాయి. పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రంలోని బహ్వాల్పూర్ (జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయమున్న నెలవు), మురిద్కే (లష్కరే తయిబా ప్రధాన స్థావరమున్న ప్రదేశం) పట్టణాలపై జరిగిన ఆ మెరుపుదాడులు ఒక వాస్తవాన్ని తిరుగులేని రీతిలో వెల్లడించాయి. పాకిస్థాన్ ఆధారిత, ప్రేరేపిత ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా సరే వారిని శాశ్వతంగా మట్టుబెట్టి తీరాలన్న భారత్ దృఢసంకల్పాన్ని అవి విశాల ప్రపంచానికి, మరీ ముఖ్యంగా ఇస్లామాబాద్ పాలకులకు ఎటువంటి మినహాయింపులు లేకుండా చాటిచెప్పాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
చిత్తూరులో ప్రారంభమైన గంగమ్మ జాతర వేడుకలు
ఎలుకలన్నీఘోషించినా వేస్ట్.. పవన్ షాకింగ్ ట్వీట్..
For More AP News and Telugu News