Dancing Dispute: డ్యాన్స్ విషయంలో గొడవ.. పెళ్లి కొడుకును కొట్టి చంపేశారు..
ABN , Publish Date - Jun 08 , 2025 | 01:07 PM
Dancing Dispute: పెళ్లి కొడుకు తరఫు వాళ్లను స్వాగతించటం కోసం పెళ్లి కూతురు వాళ్లు డీజే ఏర్పాటు చేశారు. పెళ్లికొడుకు తరఫు వాళ్లు అక్కడికి వచ్చే సమయానికి కొంతమంది యువకులు డీజేకు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు.

తాగిన మైకంలో కొంతమంది యువకులు దారుణానికి ఒడిగట్టారు. కొత్త పెళ్లి కొడుకును కొట్టి చంపేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, సెవ్రాయ్ తెహ్సిల్ ఏరియాలోని త్రిలోక్పూర్ గ్రామానికి చెందిన రాకేష్ కుమార్ అనే యువకుడికి జగదీష్పూర్ గ్రామానికి చెందిన యువతితో బుధవారం పెళ్లయింది. గురువారం పెళ్లి కూతురు ఇంటి దగ్గర రిసెప్షన్ ఏర్పాటు చేశారు. పెళ్లి కొడుకు బంధువులు అందరూ గురువారం సాయంత్రం సమయంలో పెళ్లి కూతురు ఇంటికి చేరుకున్నారు.
పెళ్లి కొడుకు తరఫు వాళ్లను స్వాగతించటం కోసం పెళ్లి కూతురు వాళ్లు డీజే ఏర్పాటు చేశారు. పెళ్లికొడుకు తరఫు వాళ్లు అక్కడికి వచ్చే సమయానికి కొంతమంది యువకులు డీజేకు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పెళ్లి కొడుకు బంధువులకు, ఆ యువకులకు మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ చినికి చినికి గాలి వానలా మారింది. గొడవను ఆపడానికి పెళ్లి కొడుకు తండ్రి వెళ్లాడు. తాగిన మత్తులో ఉన్న ఆ యువకులు ఆయనపై కర్రలతో దాడి చేయటం మొదలెట్టారు. తండ్రిని కొట్టడం చూసిన పెళ్లి కొడుకు వెంటనే అక్కడికి పరిగెత్తాడు.
ఆ యువకులు పెళ్లి కొడుకుపై కూడా దాడి చేశారు. తీవ్రంగా గాయపరిచారు. అంతటితో ఆగకుండా ఓ యువకుడు తుపాకితో పెళ్లికొడుకు తలపై గట్టిగా కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన పెళ్లి కొడుకు స్ప్రహతప్పిపడిపోయాడు. కుటుంబసభ్యులు వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి అతడు చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
అలా చేస్తే ఊరుకోను.. మస్క్కు ట్రంప్ సీరియస్ వార్నింగ్..
70 ఏళ్లుగా సహజీవనం.. 90 ఏళ్ల వయసులో పెళ్లి..