Share News

Extreme Poverty: 11 ఏళ్లలో ఎంత మార్పు.. దేశంలో భారీగా తగ్గిన పేదరికం

ABN , Publish Date - Jun 07 , 2025 | 12:56 PM

Extreme Poverty Rate: 2022-2023 నాటికి దేశంలో అత్యంత పేదరికం రేటు భారీగా పడిపోయింది. 75.24 మిలియన్ల మంది మాత్రమే అత్యంత పేదవాళ్లు ఉన్నారు. 11 ఏళ్లలో ఏకంగా 269 మిలియన్ల మంది అత్యంత పేదరికం నుంచి బయటపడ్డారు.

Extreme Poverty: 11 ఏళ్లలో ఎంత మార్పు.. దేశంలో భారీగా తగ్గిన పేదరికం
Extreme Poverty Rate

పేదరిక నిర్మూలన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలించాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదేళ్లలోనే దేశంలో అత్యంత పేదరికం రేటు బాగా తగ్గింది. 2011 నుంచి 2012 మధ్య కాలంలో దేశంలో అత్యంత పేదరికం రేటు 27.1 శాతంగా ఉండేది. 2022-2023 నాటికి అది 5.3 శాతానికి పడిపోయింది. తాజాగా, ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆ నివేదిక ప్రకారం.. 2011-2012 మధ్య కాలంలో దేశంలో అత్యంత పేదవాళ్లు 344.47 మిలియన్ల మంది ఉన్నారు.


వీరిలో 64 శాతం మంది ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు కావటం గమనార్హం. 2022-2023 నాటికి దేశంలో అత్యంత పేదరికం రేటు భారీగా పడిపోయింది. 75.24 మిలియన్ల మంది మాత్రమే అత్యంత పేదవాళ్లు ఉన్నారు. ప్రపంచ బ్యాంకు చెబుతున్న దాని ప్రకారం.. ఈ 11 ఏళ్లలో ఏకంగా 269 మిలియన్ల మంది అత్యంత పేదరికం నుంచి బయటపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత పేదరికం రేటు 18.4 శాతం నుంచి 2.8 శాతానికి పడిపోయింది.


పట్టణ ప్రాంతాల్లో అత్యంత పేదరికం రేటు 10.7 శాతం నుంచి 1.1 శాతానికి పడిపోయింది. కేవలం 11 ఏళ్లలోనే ఈ మ్యాజిక్ జరిగింది. దేశంలో బహుముఖ పేదరికం కూడా బాగా తగ్గింది. 2005-06 మధ్య కాలంలో బహుముఖ పేదరికం 53.8 శాతంగా ఉండేది. 2022-23 నాటికి అది 15.5 శాతానికి పడిపోయింది.


ఇవి కూడా చదవండి

తారాస్థాయికి గొడవలు.. మస్క్‌ను పుల్లలా తీసిపడేసిన ట్రంప్

కొత్త పార్టీ పెడుతున్న మస్క్.. పేరు ఏంటంటే..

Updated Date - Jun 07 , 2025 | 01:09 PM