Defence Budget: ఆపరేషన్ సిందూర్ సక్సెస్.. ఆర్మీకి మరో రూ.50వేల కోట్లు..
ABN , Publish Date - May 16 , 2025 | 12:59 PM
భవిష్యత్ అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ శాఖకు మరో రూ.50వేల కోట్ల నిధుల్ని కేటాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రక్షణ శాఖ బడ్జెట్ ఏకంగా రూ.7లక్షల కోట్లకు పైకే చేరుతుంది.

ఢిల్లీ: పహల్గామ్ అటాక్ తర్వాత భారత్ ఏ విధంగా స్పందిస్తుందా.. అని ప్రతీ భారత పౌరుడితోపాటు ప్రపంచం మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురు చూసింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఆపరేషన్ సిందూర్తో ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. పాకిస్థాన్లోకి చొచ్చుకెళ్లి మరీ ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదులపై దాడులు చేసింది. 100 మంది ఉగ్రవాదులు ఈ దాడుల్లో చనిపోయారు. తర్వాత రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధంలోనూ భారత్ తన సత్తా ఏంటో చూపించింది. పాకిస్థాన్లోని ఎయిర్బేస్లు, ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసింది.
ఇండియన్ ఆర్మీ వరుస విజయాలు సాధించిన నేపథ్యంలో.. భవిష్యత్ అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ శాఖకు మరో రూ.50వేల కోట్ల నిధుల్ని కేటాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2025- 2026 సంవత్సరానికి గానూ భారత ప్రభుత్వం రక్షణ శాఖకు రూ.6.81లక్షల కోట్లు కేటాయించింది. గత సంవత్సరం కంటే ఇది చాలా ఎక్కువ. 2024-2025 సంవత్సరానికి గానూ కేంద్రం రూ.6.22కోట్లు కేటాయించింది. 2025-2026 సంవత్సరానికి ఆ నిధుల్ని రూ.9.2శాతం పెంచేసింది.
వచ్చే బడ్జెట్.. అంటే 2026-2027 సంవత్సరానికి గానూ రూ.6.81 లక్షల కోట్లకు మరో రూ.50 వేల కోట్లు వచ్చి చేరే అవకాశం ఉంది. మొత్తంగా రక్షణ శాఖ బడ్జెట్ ఏకంగా రూ.7లక్షల కోట్లకు పైకే చేరుతుంది. ఇందుకు సంబంధించిన ఫైల్ వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందనుంది. రూ.7లక్షల కోట్ల బడ్జెట్ మొత్తాన్ని రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఆయుధాల కొనుగోళ్లు, ఇతర అవసరమైన వస్తువుల కొనుగోలుకు వాడనున్నారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రక్షణ శాఖపై ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే ఏకంగా రూ. 2.29లక్షల కోట్లను కేటాయించారు.
ఇవి కూడా చదవండి
Dipika Kakar: పాపం నటికి ఎంత కష్టం వచ్చింది.. కాలేయంలో టెన్నిస్ బాల్ సైజు ట్యూమర్
Viral Video: ఇలాంటి స్వాగతాన్ని మీరెప్పుడూ చూసుండరు..