Air India Plane crash: నో పవర్.. నో థ్రస్ట్.. గోయింగ్ డౌన్.. ప్రమాదానికి ముందు పైలెట్ చివరి మాటలు ఇవే..
ABN , Publish Date - Jun 14 , 2025 | 07:15 PM
అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయల్దేరిన ఎయిరిండియా విమానం కొన్ని సెకెన్లలోనే కూలిపోయిన సంగతి తెలిసిందే. విమానం కూలిపోక ముందు కాక్పిట్లో ఏం జరిగిందనేది మాత్రం ఇంకా పూర్తిగా బయటకు రాలేదు.

గుజరాత్: అహ్మదాబాద్ (Ahmedabad)లోని సర్దార్ వల్లభాయ్పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయల్దేరిన ఎయిరిండియా విమానం కొన్ని సెకెన్లలోనే కూలిపోయిన (Plane crash ) సంగతి తెలిసిందే. విమానం కూలిపోక ముందు కాక్పిట్లో ఏం జరిగిందనేది మాత్రం ఇంకా పూర్తిగా బయటకు రాలేదు(Air India Plane crash). అయితే విమానం కూలిపోయే సమయంలో ఏటీసీ (Air Traffic Control)తో పైలెట్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి.
ఏటీసీతో ఎయిరిండియా పైలెట్ చివరి సంభాషణ వైరల్ అవుతోంది. 'విమానంలో పవర్ లేదు. నో థ్రస్ట్. గోయింగ్ డౌన్.. మేడే.. మేడే.. మేడే..' అని పైలెట్ సుమత్ చెప్పారు. ఈ సంభాషణ ఏటీసీలో రికార్డు అయింది. థ్రస్ట్ అంటే విమానాన్ని ముందుకు నడిపే శక్తి. ఇది విమానం ఇంజిన్లు లేదా ప్రొపెల్లర్ల ద్వారా ఉత్పత్తి అవుతుంది. థ్రస్ట్ అనే పదానికి తెలుగులో నెట్టడం అనే అర్థం కూడా ఉంది. దీంతో ఈ విమాన ప్రమాదంలో ఇంజిన్ లేదా ప్రొపెల్లర్ల వైఫల్యం కీలక పాత్ర పోషించినట్టు అర్థమవుతోంది.
మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కూలిపోయి మంటల్లో చిక్కుకుంది. భారీ ప్రాణనష్టం సంభవించింది. విమానం ఓ మెడికల్ కాలేజ్ మీద పడింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 274కు చేరింది. ఈ ప్రమాదంపై కేంద్ర పౌరవిమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనపై దర్యాఫ్తునకు ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. 27 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా..
మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
For National News And Telugu News