Sheikh Hasina: మహ్మద్ యూనస్ దేశాన్ని అమెరికాకు అమ్మేశాడు.. మాజీ ప్రధాని షేక్ హసీనా..
ABN , Publish Date - May 25 , 2025 | 09:37 PM
Sheikh Hasina Comments: ఈ మేరకు పార్టీ ఫేస్బుక్ ఖాతాలో ఓ ఆడియో పోస్టు పెట్టారు. యూనస్ తీవ్రవాద గ్రూపుల సాయంతో ప్రభుత్వాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారని అన్నారు. తన పార్టీ ‘అవామీ లీగ్ పార్టీ’ని నిషేధించడాన్ని ఆమె తప్పుబట్టారు.

బంగ్లాదేశ్లో గత కొంతకాలం నుంచి రాజకీయ సంక్షోభం నడుస్తోంది. ఆ దేశ తాత్కాళిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ తన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, ఆయన మాత్రం రాజీనామాపై స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా.. మహ్మద్ యూనస్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. యూనస్ బంగ్లాదేశ్ను అమెరికాకు అమ్మేశాడని ఆమె ఆరోపించారు. తన పార్టీ ‘అవామీ లీగ్ పార్టీ’ని నిషేధించడాన్ని ఆమె తప్పుబట్టారు.
ఈ మేరకు పార్టీ ఫేస్బుక్ ఖాతాలో ఓ ఆడియో పోస్టు పెట్టారు. యూనస్ తీవ్రవాద గ్రూపుల సాయంతో ప్రభుత్వాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారని అన్నారు. ఆ ఆడియోలో ఇంకా ఏమందంటే.. ‘ నా ప్రభుత్వ హయాంలోనే యూనస్ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నాడు. మేము ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేశాము. అలాంటిది యూనస్ మాత్రం ప్రభుత్వ పగ్గాలను ఉగ్రవాదుల చేతుల్లో పెట్టాడు. సెయింట్ మార్టిన్ ఐలాండ్ విషయంలో మా నాన్న అమెరికా డిమాండ్స్కు ఒప్పుకోలేదు.
దాని కోసమే తన ప్రాణాలు అర్పించారు. అధికారం కోసం దేశాన్ని అమెరికాకు అమ్మేస్తారని అనుకోలేదు. అంగుళం భూమిని కూడా ఇతరులకు ఇవ్వాలన్న ఉద్దేశ్యం ఎవ్వరికీ ఉండకూడదు. కానీ, ఇప్పుడు అదే జరిగింది. అలాంటి వ్యక్తే అధికారంలోకి వచ్చాడు. టెర్రరిస్టుల సాయంతో అధికారంలోకి వచ్చాడు. టెర్రరిస్టు దాడుల తర్వాత చాలా మందిని అరెస్ట్ చేశాం. జైల్లో పడేసాం. కానీ, ఇప్పుడు జైళ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అతడు అధికారంలోకి వచ్చాక అందర్నీ వదిలేశాడు. ఇప్పుడు బంగ్లాదేశ్ మిలిటెంట్ల రాజ్యంలా మారింది’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
Minister Satyakumar: 2047 నాటికి ప్రపంచంలో రెండో స్థానానికి భారత్ ఎదగడం ఖాయం
Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్పై ట్రాన్స్జెండర్ల దారుణం..