Share News

NEET UG 2025: MBBS అడ్మిషన్ కోసం ఓబీసీ స్టూడెంట్స్‌ ఎంత స్కోరు సాధించాలి..

ABN , Publish Date - Jun 13 , 2025 | 10:16 AM

నీట్‌ యూజీ 2025 రిజల్ట్స్‌ ఎప్పుడు విడుదల అవుతాయి? ఓబీసీ అభ్యర్థులకు MBBSలో సీటు రావాలంటే ఎంత స్కోరు సాధించాలి? ఏ రాష్ట్రంలో అత్యధిక MBBS సీట్లు ఉన్నాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

NEET UG 2025: MBBS అడ్మిషన్ కోసం ఓబీసీ స్టూడెంట్స్‌ ఎంత స్కోరు సాధించాలి..
Neet 2025

NEET UG 2025 : నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ 2025 పరీక్ష ఫలితాలు జూన్‌ 14న విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర యూజీ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి గత నెల మే 4వ తేదీన నీట్‌ యూజీ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ ఎగ్జామ్‌కు సుమారు 22 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు.


ఈ నీట్‌ యూజీ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంక్‌ ఆధారంగా ఎంబీబీఎస్‌ (MBBS), బీడీఎస్‌ (BDS), బీఎస్‌ఎంఎస్‌ (BSMS), బీయూఎంఎస్‌( BUMS), బీహెచ్‌ఎంఎస్‌( BHMS) వంటి మెడికల్‌ యూజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అయితే, OBC కేటగిరీకి చెందినవారు MBBS అడ్మిషన్ కోసం ఎంత స్కోరు సాధించాలి? ఎన్ని మార్కులు వస్తే ప్రభుత్వ కాలేజీలో MBBS సీటు వస్తుంది? అనే విషయాల గురించి తెలుసుకుందాం..

కనీసం 610 మార్కులు

ఒక సాధారణ అభ్యర్థికి (General Category) AIIMS వంటి టాప్ ప్రభుత్వ కాలేజీలో సీటు రావాలంటే కనీసం 650 లేదా అంతకు పైగా మార్కులు రావాలి. కానీ, OBC కేటగిరీకి చెందిన అభ్యర్థులు కనీసం 610 మార్కులు సాధిస్తే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో MBBS సీటు పొందే అవకాశం ఉంటుంది.

MBBS సీట్లు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి?
భారతదేశంలో లక్షకు పైగా MBBS సీట్లు ఉన్నాయి. అందులో కర్ణాటక రాష్ట్రంలో అత్యధిక MBBS సీట్లు ఉన్నాయి. తర్వాతి స్థానంలో సుమారు 12, 415 MBBS సీట్లతో ఉత్తరప్రదేశ్ ఉంది.


Also Read:

ఆ సమయంలో రాజకీయాలు మానేయాలనిపించింది..

విమాన ప్రమాదంపై స్పందించిన ట్రంప్.. ఏమన్నారంటే..

For More Lifestyle News

Updated Date - Jun 13 , 2025 | 02:37 PM