Share News

Mumbai: యూటీఐ మల్టీ క్యాప్ ఫండ్‌, యాక్సిస్ ఫైనాన్స్ దిశా హోమ్ లోన్స్ ప్రారంభం

ABN , Publish Date - Apr 29 , 2025 | 10:18 PM

యూటీఐ మ్యూచువల్ ఫండ్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్లలో పెట్టుబడి పెట్టే ఓపెన్-ఎండెడ్ ఈక్విటీ స్కీమ్ యూటీఐ మల్టీ క్యాప్ ఫండ్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

Mumbai: యూటీఐ మల్టీ క్యాప్ ఫండ్‌, యాక్సిస్ ఫైనాన్స్ దిశా హోమ్ లోన్స్ ప్రారంభం

ముంబై: యూటీఐ మ్యూచువల్ ఫండ్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్లలో పెట్టుబడి పెట్టే ఓపెన్-ఎండెడ్ ఈక్విటీ స్కీమ్ యూటీఐ మల్టీ క్యాప్ ఫండ్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. “మీ పోర్ట్‌ఫోలియోకు మల్టీ-విటమిన్స్”గా స్థానం పొందిన ఈ ఫండ్, అన్ని మార్కెట్ క్యాప్‌లను కలిపి ఒకే పోర్ట్‌ఫోలియో సొల్యూషన్‌ను అందిస్తుంది. 3S విధానం—సైజ్, సెక్టార్స్, స్టైల్—ను అనుసరించి, వివిధ మార్కెట్ చక్రాలను తట్టుకునేలా రూపొందించబడింది. న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌ఓ) 2025 ఏప్రిల్ 29న ప్రారంభమై మే 13న ముగుస్తుంది. కనీస పెట్టుబడి రూ. 1,000, ఆ తర్వాత రూ. 1 గుణిజాలలో ఉంటుంది. యూటీఐ ఏఎంసీ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ వెట్రి సుబ్రమణియం మాట్లాడుతూ... “యూటీఐ మల్టీ క్యాప్ ఫండ్, దీర్ఘకాలిక సంపద సృష్టికి అనుగుణంగా ఆలోచనాత్మకంగా రూపొందించిన పెట్టుబడి సొల్యూషన్‌లను అందించే మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఇది మార్కెట్‌కు అనుగుణంగా అన్ని పరిస్థితుల్లో పనిచేసే సమగ్ర పెట్టుబడి సొల్యూషన్‌. మా ఈక్విటీ రీసెర్చ్ సామర్థ్యం, సెక్టార్లు, వ్యాపార చక్రాలలోని లోతును ప్రదర్శిస్తూ, వ్యూహాత్మక వైవిధ్యంతో కోర్ ఈక్విటీ పోర్ట్‌ఫోలియో నిర్మించాలనుకునే పెట్టుబడిదారులకు సమర్థవంతమైన ఎంపిక” అని పేర్కొన్నారు.


వారికి రుణాలు..

ముంబై: నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ యాక్సిస్ ఫైనాన్స్ అక్షయ తృతీయ సందర్భంగా దిశా హోమ్ లోన్స్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థికంగా నిస్సహాయ వర్గాలు (EWS), తక్కువ ఆదాయ వర్గాల (LIG) గృహ కొనుగోలు కలలను సాకారం చేయడానికి ఈ రుణాలు రూపొందించామని సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా యాక్సిస్ ఫైనాన్స్ ఎండీ & సీఈవో సాయి గిరిధర్ మాట్లాడుతూ.. “అక్షయ తృతీయ సందర్భంగా దిశా హోమ్ లోన్స్‌ను ప్రారంభించడం గృహ కొనుగోలును సులభతరం చేయాలన్న మా లక్ష్యాన్ని సూచిస్తుంది. ఇవి ఆర్థికంగా నిస్సహాయ వర్గాల ఇంటి కలను సాకారం చేయడానికి ఆర్థిక అంతరాలను తొలగించడంలో ఈ రుణాలు సహాయపడతాయి. ప్రభుత్వ గృహ ఫైనాన్స్ లక్ష్యాలకు అనుగుణంగా, వివిధ ప్రాంతాల కస్టమర్లకు అనుకూలీకరించిన సొల్యూషన్స్ అందిస్తాం. పారదర్శక సేవలు, అత్యుత్తమ అనుభవంతో కస్టమర్లకు ఉన్నతమైన సొల్యూషన్స్ అందించడం మా లక్ష్యం. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న కొద్దీ, టెక్నాలజీ, డేటా సైన్స్ మా కార్యకలాపాలకు పునాదిగా నిలుస్తాయి. గృహ ఫైనాన్స్‌ను సులభంగా, నిరాటంకంగా అందించడంపై మేం దృష్టి సారించాం” అని పేర్కొన్నారు.


ముథూట్ ఫిన్‌కార్ప్ ఎన్‌సీడీ సిరీస్ V ప్రారంభం....

ముంబై: ముథూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ (ఎంఎఫ్ఎల్) సెక్యూర్డ్, రిడీమబుల్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎన్‌సీడీ) V విడతను జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. 2025 ఏప్రిల్ 29 నుంచి జారీ ప్రారంభమవుతుంది. ఒక్కో డిబెంచర్ ముఖ విలువ రూ. 1,000గా ఉంటుంది. రూ. 100 కోట్ల బేస్ సైజుతో, రూ. 250 కోట్ల గ్రీన్ షూ ఆప్షన్‌తో కలిపి ఈ ఇష్యూ మొత్తం రూ. 350 కోట్లుగా ఉంటుంది. 2025 ఏప్రిల్ 29 నుంచి మే 13 వరకు సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉంటుంది. డైరెక్టర్ల బోర్డు లేదా స్టాక్ అలాట్‌మెంట్ కమిటీ ఆమోదంతో, సెబీ ఎన్‌సీఎస్ నిబంధనలకు అనుగుణంగా ముందుగా ముగించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ముథూట్ ఫిన్‌కార్ప్ సీఈవో షాజీ వర్గీస్ మాట్లాడుతూ... “సురక్షిత, అధిక రాబడి అందించే పెట్టుబడి అవకాశంగా కొత్త ఎన్‌సీడీ సిరీస్‌ను ప్రవేశపెట్టడం సంతోషకరం. మా 3,700 శాఖలు, ముథూట్ ఫిన్‌కార్ప్ వన్ యాప్, భాగస్వామ్య నెట్‌వర్క్ ద్వారా రూ. 5 లక్షల వరకు పెట్టుబడులు సులభంగా చేయవచ్చు. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వినూత్న ఆర్థిక సాధనాలను అందించే మా నిబద్ధతకు ఈ ఎన్‌సీడీ నిదర్శనం” అని పేర్కొన్నారు.


ఐఎఫ్ డిజైన్ అవార్డును గెలుపొందిన టాటా ఎలక్సీ...

డిజైన్, టెక్నాలజీ సేవల్లో రాణిస్తున్న టాటా ఎలక్సీ, యూజర్ ఎక్స్‌పీరియన్స్ (యూఎక్స్), ఏఆర్/వీఆర్ రంగాల్లో రెండు ఆవిష్కరణలకు ప్రతిష్ఠాత్మక ఐఎఫ్ డిజైన్ అవార్డు 2025ను అందుకుంది. 2025 ఎడిషన్‌లో 72 దేశాల నుంచి 11,000కు పైగా ఎంట్రీలను 131 మంది స్వతంత్ర నిపుణులు ఐడియా, ఫామ్, ఫంక్షన్, డిఫరెన్షియేషన్, సస్టైనబిలిటీ ఆధారంగా మూల్యాంకనం చేశారు.

Updated Date - Apr 29 , 2025 | 10:30 PM