Stock Market Thursday Closing: గురువారం భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
ABN , Publish Date - Apr 17 , 2025 | 03:37 PM
భారత స్టాక్ మార్కెట్లు వారం చివరి రోజు(గురువారం) బుల్ ర్యాలీ తీశాయి. మార్కెట్లు మొదలైనప్పటి నుంచి ఏకబిగిన మార్కెట్లు ముందుకు సాగాయి. వరుసగా నాలుగవ రోజును భారీ లాభాలతో ముగించాయి.

Stock Market Wednesday Closing: ఇవాళ (గురువారం) భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. ఈ ఉదయం నుంచీ ఏకబిగిన పెరుగుతూ పోయాయి. ఉదయం సెన్సెక్స్, నిఫ్టీ, సూచీలు స్వల్ప నష్టాల్లో ఉన్నా.. తర్వాత నుంచి భారీగా పరుగులు పెట్టాయి. ఒక దశలో నిఫ్టీ 23,861 పాయింట్ల దగ్గర గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 78, 566 పాయింట్ల గరిష్టానికి వెళ్లింది. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1508.91 పాయింట్లు (1.96 శాతం) లాభంతో.. 78,553.20 వద్ద, నిఫ్టీ 414.45 పాయింట్ల(1.77శాతం) లాభంతో.. 23,851.65 పాయింట్ల వద్ద నిలిచాయి. బ్యాంక్ నిఫ్టీ 1,172.45 పాయింట్లు పెరిగింది.
ఇవాళ ఆటో, ఫార్మా, ఫైనాన్షియల్ కంపెనీ స్టాక్స్ భారీ ర్యాలీ తీశాయి. దాదాపు 2340 షేర్లు ఇవాళ పుంజుకోవడం విశేషం. 1468 షేర్లు క్షీణించాయి. 149 షేర్ల విలువలో ఎలాంటి మార్పు లేకుండా స్తబ్దుగా ఉన్నాయి. టెలికాం, PSU బ్యాంక్, ఆయిల్ & గ్యాస్, ఫార్మా, ఆటో, ఎనర్జీ, ప్రైవేట్ బ్యాంక్ 1-2 శాతం పెరిగాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. BSE మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఒక్కొక్కటి 0.5 శాతం పెరిగాయి. భారతీ ఎయిర్టెల్, ICICI బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, ఎటర్నల్ నిఫ్టీలో ప్రధానంగా లాభాలను ఆర్జించగా, విప్రో, హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా ఇంకా JSW స్టీల్ నష్టపోయాయి.
For AndhraPradesh News And Telugu News