Share News

Stock Market: లాభాలతో ముగిసిన సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..

ABN , Publish Date - Jun 11 , 2025 | 03:44 PM

విదేశీ మదుపర్లు పెట్టుబడులను క్రమంగా పెంచుకుంటుండడంతో దేశీయ సూచీలు గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్నాయి. మంగళవారం కూడా విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.2302 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. గత మూడు రోజులుగా వారు షేర్ల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు.

Stock Market: లాభాలతో ముగిసిన సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..
Stock Market

విదేశీ మదుపర్లు పెట్టుబడులను క్రమంగా పెంచుకుంటుండడంతో దేశీయ సూచీలు గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్నాయి. మంగళవారం కూడా విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.2302 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. గత మూడు రోజులుగా వారు షేర్ల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో సూచీలు ఇటీవలి నష్టాల నుంచి క్రమంగా కోలుకున్నాయి. బుధవారం కూడా స్టాక్‌మార్కెట్లు ఓ మోస్తరు లాభాలను ఆర్జించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను అరశాతం మేర తగ్గించడం అటు విదేశీ, ఇటు స్వదేశీ మదుపర్లను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం లాభాపడ్డాయి. (Business News).


మంగళవారం ముగింపు (82, 391)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి దూసుకెళ్లింది. ఓ దశలో 350 పాయింట్లకు పైగా లాభపడి 82, 783 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. బుధవారం సెన్సెక్స్ 82, 308-82,783 శ్రేణి మధ్యలో కదలాడింది. చివరకు సెన్సెక్స్ 123 పాయింట్ల లాభంతో 82, 515 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 37 పాయింట్ల లాభంతో 25, 141 వద్ద రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం వరుసగా రెండో రోజు కూడా నష్టపోయింది.


సెన్సెక్స్‌లో ఆయిల్ ఇండియా, బీపీసీఎల్, బయోకాన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఐఈఎక్స్, యునైటెడ్ స్పిరిట్స్, బీఎస్‌ఈ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 293 పాయింట్ల నష్టంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 169 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.51గా ఉంది.


ఇవి కూడా చదవండి

రాజీవ్‌ యువ వికాసం మరింత జాప్యం

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల కల సాకారమయ్యేనా

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 11 , 2025 | 03:45 PM