ITR Filing Date: ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగింపు.. ఐటీ విభాగం కీలక ప్రకటన
ABN , Publish Date - May 27 , 2025 | 07:18 PM
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను రిటర్నుల దాఖలు తుది గడువును పొడిగించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఐటీ విభాగం కీలక ప్రకటన జారీ చేసింది. నిజానికి 2024-25 ఆదాయపు పన్ను దాఖలు చేసే తుది గడువు ఈ ఏడాది జులై 31తో ముగియనుంది.

ఆదాయపు పన్ను (Income Tax) రిటర్నుల దాఖలుపై ఐటీ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను రిటర్నుల దాఖలు తుది గడువును (ITR Filing Date) పొడిగించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఐటీ విభాగం కీలక ప్రకటన జారీ చేసింది. నిజానికి 2024-25 ఆదాయపు పన్ను దాఖలు చేసే తుది గడువు ఈ ఏడాది జులై 31తో ముగియనుంది. ఆ గడువును ఐటీ విభాగం తాజాగా సెప్టెంబర్ 15 వరకు పెంచింది.
ఐటీఆర్ ఫారాల నోటిఫికేషన్ జారీ ఆలస్యం అయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐటీ విభాగం తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి నోటిఫై చేసిన ఐటీఆర్ ఫారాల్లో చేపట్టిన మార్పులకు అనుగుణంగా సిస్టమ్ను సిద్ధం చేయడానికి కొంత సమయం పడుతుందని, ఈ క్రమంలో ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుండా రిటర్నులు ఫైల్ చేయడం కోసం జులై 31తో ముగియనున్న గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తున్నట్టు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది.
ఇవీ చదవండి:
నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్ను ఓవర్ టేక్ చేసిన వైనం
వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్లో ఐఫోన్లు తయారు చేస్తే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి