Share News

UPI Payments: యూపీఐ యూజర్లకు షాక్.. చెల్లింపులు రూ.3 వేలు దాటితే ఛార్జీలు?

ABN , Publish Date - Jun 11 , 2025 | 03:33 PM

మనదేశంలో యూపీఐ చెల్లింపులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి చిన్న చిన్న బడ్డీ దుకాణాల వరకు అందరికీ చాలా మంది యూపీఐల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ఇప్పటివరకు యూపీఐ మీద ఎలాంటి ఛార్జీలను విధించడం లేదు.

UPI Payments: యూపీఐ యూజర్లకు షాక్.. చెల్లింపులు రూ.3 వేలు దాటితే ఛార్జీలు?
Charges On UPI Payments

మనదేశంలో యూపీఐ (UPI Payments) చెల్లింపులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి చిన్న చిన్న బడ్డీ దుకాణాల వరకు చాలా మంది యూపీఐల ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. ఇప్పటివరకు యూపీఐ మీద ఎలాంటి ఛార్జీలను విధించడం లేదు. అయితే త్వరలోనే ఈ లావాదేవీలపై కూడా ఛార్జ్‌లను వసూలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ఓ జాతీయ మీడియా వెల్లడించింది (Charges On UPI Payments).


డిజిటల్ లావాదేవీలను నిర్వహించడం వల్ల ఖర్చులు పెరుగుతున్నాయని బ్యాంకులు, చెల్లింపు సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో వీరికి సహకరించేందుకు మర్చెంట్ డిస్కౌంట్ రేట్‌లను (MDR Charges) వసూలు చేయాలని కేంద్రం ఆలోచిస్తోందట. వార్షిక ఆదాయం ద్వారా కాకుండా లావాదేవీల ఆధారంగా ఈ ఛార్జ్‌లను వసూలు చేయాలనుకుంటున్నట్టు సమాచారం. యూపీఐ ద్వారా 3000 రూపాయల పైచిలుకు చెల్లింపులు జరిగితే ఎండీఆర్ ఛార్జీలను వసూలు చేస్తారట. నిజానికి 2020 నుంచి జీరో ఎండీఆర్ పాలసీ అమల్లో ఉంది. త్వరలోనే ఈ పాలసీకి కేంద్రం స్వస్తి పలకబోతోంది.


ఈ ఎండీఆర్ ఛార్జీల వల్ల వినియోగదారులపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయంలో పూర్తి క్లారిటీ లేదు. ఈ లావాదేవీల ఎండీఆర్ ఛార్జీలను యూజర్ల నుంచి కాకుండా వ్యాపారస్తుల నుంచి స్వీకరించే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే పూర్తి సమాచారం ప్రస్తుతానికి తెలియదు. ప్రస్తుతం డెబిడ్, క్రెడిట్ కార్డులపై ఎండీఆర్ 0.9 నుంచి 2 శాతం వరకు ఉన్నాయి. యూపీఐ లావాదేవీలపై ప్రస్తుతానికి 0.3 శాతం ఎండీఆర్ విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి

రాజీవ్‌ యువ వికాసం మరింత జాప్యం

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల కల సాకారమయ్యేనా

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 11 , 2025 | 03:33 PM