Share News

Today Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..

ABN , Publish Date - Jun 05 , 2025 | 07:28 AM

Today Gold Rate: పసిడికి మార్కెట్లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే పసిడి ధరలు గత కొంత కాలం నుంచి పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. జూన్ నెల ప్రారంభంలోనే భారతదేశంలో బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగాయి.

Today Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
Gold Rate Today

Business News: పసిడికి (Gold) మార్కెట్లో (Market) ఎల్లప్పుడూ డిమాండ్ (Demand) ఉంటుంది. అయితే పసిడి ధరలు గత కొంత కాలం నుంచి పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. జూన్ నెల ప్రారంభంలోనే బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగాయి. తాజాగా 24 క్యారెట్లు బంగారం గ్రాముకు రూ. 11 పెరిగి రూ. 9,917గా ఉండగా, 22 క్యారెట్లు బంగారం గ్రాముకు రూ. 10 పెరిగి రూ. 9,090గా ఉంది. అలాగే 18 క్యారెట్లు బంగారం గ్రాముకు రూ. 8 పెరిగి రూ. 7,438గా ట్రేడవుతోంది.


భారతదేశంలో బంగారం ధరలు..

ప్రస్తుతం 100 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లు రూ. 9,91,700 గా ఉంది. అదే 22 క్యారెట్ల బంగారం ధర రూ.9,09,000.. 18 క్యారెట్లు రూ.7,43,800గా ఉంది. అదే సమయంలో 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లు రూ.99,170.. 22 క్యారెట్లు రూ.90,900.. 18 క్యారెట్లు రూ.74,380గా ఉంది.


హైదరాబాద్‌లో బంగారం ధరలు..

నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 99,180.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90,910.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ. 74,390గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.


దేశవ్యాప్తంగా బంగారం (24, 22, 18 క్యారెట్ల) ధరలు ఎలా ఉన్నాయంటే..

కోల్‌కతా- రూ.99,180, రూ.90,910, రూ.74,390

చెన్నై- రూ.99,180, రూ.90,910, రూ.74,810

బెంగళూరు- రూ.99,180, రూ.90,910, రూ.74,390

పుణె- రూ.99,180, రూ.90,910, రూ.74,390

అహ్మదాబాద్- రూ.99,180, రూ.90,960, రూ.74,430

భోపాల్- రూ. 99,230, రూ.90,960, రూ.74,430

కోయంబత్తూర్- రూ. 99,180, రూ.90,910, రూ.74,810

పట్నా- రూ. 99,230, రూ.90,960, రూ.74,430

సూరత్- రూ. 99,230, రూ.90,960, రూ.74,430

పుదుచ్చెరి- రూ. 99,180, రూ.90,910, రూ.74,810


వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌లో కేజీ వెండి రూ. 100 పెరిగి.. రూ. 1,13,100గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండికి రూ. 100 పెరిగి. రూ.1,02,100కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండికి రూ. 100 పెరిగి. రూ.1,02,100 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడలో కేజీ ధర రూ.1,13,100గా ఉంది, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 1,13,100 వద్ద కొనసాగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

విధ్వంస పాలనపై ప్రజా ఆకాంక్షల విజయం

24 గంటల్లో 864 కొవిడ్‌ కేసులు

For More AP News and Telugu News

Updated Date - Jun 05 , 2025 | 07:29 AM