Share News

Air India Crash Compensation: ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితులకు పరిహారం ఎంత ఇస్తారంటే..

ABN , Publish Date - Jun 12 , 2025 | 07:14 PM

అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ గురువారం మధ్యాహ్నం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ఉన్నారు. అయితే ఈ ఘటనలో మరణించిన బాధిత కుటుంబాలకు పరిహారం ఎంత (Air India Crash Compensation) వస్తుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Air India Crash Compensation: ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితులకు పరిహారం ఎంత ఇస్తారంటే..
Air India Crash Compensation

గుజరాత్ అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఎయిర్ ఇండియా విమానం గురువారం (జూన్ 12, 2025) దుర్ఘటనకు (Gujarat Ahmedabad Plane Crash) గురైంది. లండన్ గాట్విక్ వెళ్లాల్సిన ఈ బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిందని అక్కడి పోలీసు కంట్రోల్ రూమ్ ధృవీకరించింది. ఈ ఘటనతో దేశమంతా షాక్‌కు గురైంది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, బాధితులకు ఎయిర్‌లైన్ నుంచి, అలాగే ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా ఎంత పరిహారం (Air India Crash Compensation) అందుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


బాధితులకు ఎంత పరిహారం

  • ఈ ఘటనలో మృతి చెందిన ప్రతి వ్యక్తి కుటుంబానికి రూ.1 కోటీ ఇవ్వనున్నట్లు టాటా గ్రూప్ తెలిపింది. దీంతోపాటు అంతర్జాతీయ విమానాల్లో మరణం లేదా గాయాలు సంభవించినప్పుడు, భారతదేశంలో నడిచే విమానయాన సంస్థలు 1999 మాంట్రియల్ కన్వెన్షన్‌కు కట్టుబడి ఉంటాయి. భారత్ ఈ అంతర్జాతీయ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ కన్వెన్షన్ ప్రకారం బాధితులకు ఈ కింది విధంగా పరిహారం అందుతుంది.

  • 128,821 స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDRs): దాదాపు రూ. 1.4 కోట్లు. ఈ మొత్తం ప్రతి ప్రయాణీకుడికి, ఎయిర్‌లైన్ తప్పిదం లేకపోయినా అందించబడుతుంది.

  • ఎక్కువ పరిహారం: ఎయిర్‌లైన్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగినట్లు నిరూపితమైతే, ఇంకా ఎక్కువ మొత్తం చెల్లించే అవకాశం ఉంది.

  • ఈ నిబంధనలు అంతర్జాతీయ విమానాలకు వర్తిస్తాయి. అయితే, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) మార్గదర్శకాల ప్రకారం, భారతీయ ఎయిర్‌లైన్స్ సాధారణంగా దేశీయ విమానాలకు కూడా ఇలాంటి కవరేజీని అందిస్తాయి. (Air India Crash Compensation)


ట్రావెల్ ఇన్సూరెన్స్

ఎయిర్‌లైన్ పరిహారంతో పాటు, ట్రావెల్ ఇన్సూరెన్స్ కీలక పాత్ర పోషిస్తుంది. విమాన ఆలస్యం, ఆసుపత్రి ఖర్చులు లేదా ప్రమాదాల వంటి అనూహ్య పరిస్థితుల్లో ఈ ఇన్సూరెన్స్ ఆర్థిక భద్రతను అందిస్తుంది.

విమాన ప్రమాద ఇన్సూరెన్స్ ఎందుకు ముఖ్యం?

విమాన ప్రమాదాలు చాలా అరుదైనవి అయినప్పటికీ, వాటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకే విమాన ప్రమాద ఇన్సూరెన్స్ ఒక స్మార్ట్ ఎంపిక. ఈ ఇన్సూరెన్స్ విమాన ప్రయాణంలో జరిగే ప్రమాదాలకు ప్రత్యేక కవరేజ్ అందిస్తుంది. ఇది ఆర్థిక భద్రతతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.


కాంప్రిహెన్సివ్ ట్రావెల్ ఇన్సూరెన్స్

  • కాంప్రిహెన్సివ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు ప్రయాణీకులను వివిధ రకాల రిస్క్‌ల నుంచి రక్షిస్తాయి. ఈ ప్లాన్‌లలో సాధారణంగా ఈ కింది కవరేజీలు ఉంటాయి:

  • అక్కాడెంటల్ డెత్ బెనిఫిట్స్: రూ. 25 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు

  • పర్మనెంట్ డిసాబిలిటీ: రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు

  • మెడికల్ ఎమర్జెన్సీలు: ఆసుపత్తి, మెడికల్ ఖర్చులు

  • విమాన ఆలస్యం/ ట్రిప్ రద్దు: రీయింబర్స్‌మెంట్ సౌకర్యం

  • డైలీ అలవెన్స్: ఆసుపత్రిలో చేరినప్పుడు లేదా ప్రయాణంలో ఆటంకం కలిగినప్పుడు రోజువారీ భత్యం

  • ఈ ఇన్సూరెన్స్ పాలసీలు ప్రయాణీకులు, వారి కుటుంబాలకు ఆర్థిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, ఊహించని సంఘటనల సమయంలో మానసిక ఆందోళనను కూడా తగ్గిస్తాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

వణికించిన టాప్ 10 విమాన ప్రమాదాలు..

ఎయిర్ ఇండియా ప్రమాదం ఫస్ట్ వీడియో

For National News And Telugu News

Updated Date - Jun 12 , 2025 | 08:09 PM