Share News

Triplets Born in Hindupur: ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలు

ABN , Publish Date - Apr 18 , 2025 | 04:37 AM

హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలను జన్మనిచ్చారు. వీరిలో ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు, వారి బరువు తక్కువ కావడంతో అనంతపురానికి రెఫర్ చేశారు

Triplets Born in Hindupur: ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలు

హిందూపురం, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చారు. వీరిలో ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. రొద్దం మండలం శేషాపురం గ్రామానికి చెందిన శిల్ప బుధవారం రాత్రి పురిటినొప్పులతో హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. ఆమె గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రసవించారు. సాధారణ కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చారు. వారి బరువు తక్కువగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్‌ చేశామని డాక్టర్‌ నీరజ తెలిపారు. తల్లి ఆరోగ్యంగా ఉన్నారని ఆమె అన్నారు.

Updated Date - Apr 18 , 2025 | 04:37 AM