ఐదేళ్లు దాటితే బదిలీ
ABN , Publish Date - Jun 14 , 2025 | 01:11 AM
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 30వ తేదీలోగా దీనిని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు అప్పగిం చింది.

కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామానికి చెందిన నులకాని ప్రసాద్ ముగ్గురు పిల్లలు
ఈ నెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశం
ఉద్యోగుల హేతుబద్ధీకరణ ప్రాతిపదిక.. దివ్యాంగులకు తొలి ప్రాధాన్యత
భీమవరం టౌన్, జూన్ 13(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 30వ తేదీలోగా దీనిని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు అప్పగిం చింది. బదిలీల అనంతరం ఉద్యోగుల వివరాలను, రాష్ట్ర ప్రభుత్వ హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో వచ్చే నెల 10వ తేదీలోగా పొందుపరచాలి. వార్డు, గ్రామ సచివాలయా ల్లో ఈ ఏడాది మే 31 నాటికి ఐదేళ్లు పూర్తయిన ప్రతీ సచివాలయ ఉద్యోగిని బదిలీ చేస్తారు. ఉద్యోగుల హేతుబద్దీకరణతోపాటు బదిలీల పక్రియ పూర్తి చేసేలా ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది. సచివాలయ ఉద్యోగలు హేతుబద్దీకరణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీచేసింది. అందుకు క్లస్టర్లను పరిగణలోకి తీసుకుంది. పట్టణాలు, పల్లెల్లో రెండు సచివాలయాలకు ఒక క్లస్టర్ను ఏర్పాటుచేశారు. జనాభా నిష్పత్తిని బట్టి ఆరుగురు, ఏడుగురు. ఎనిమిది మంది సిబ్బం ది ఉండేలా సచివాలయాలను మూడు కేటగిరిలుగా విభజించారు. క్లస్టర్ పరిధిలో సిబ్బందిని హేతుబద్దీకరణను ప్రామాణికంగా తీసుకున్నారు. ఉదాహరణకు సర్వేయర్ క్లస్టర్ పరిధిలో ఒక సచివాలయంలో ఉంటే రెండింటిలోను విధులు నిర్వ హించాలి. సర్వేయర్ లేని సచివాలయాలకు కొత్త పోస్టింగ్ ఇవ్వరు. సదరు క్లస్టర్ పరిధిలో సర్వేయర్ రెండు సచివాలయాల బాధ్యతలు నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సిబ్బంది హేతుబద్దీకరణకు ఇదే సూత్రాన్ని అనుసరించింది. మిగులు సిబ్బందిని ఇతర సచివాలయాలకు, ఇతర మండలాలకు పంపిస్తారు. అవసరం లేదనుకుంటే అదే సచివాలయంలో మిగులు సిబ్బంది పనిచేయనున్నారు.
జిల్లాలో 535 సచివాలయాలు
జిల్లాలో 535 సచివాలయాలు ఉన్నాయి. వాటిని 275 క్లస్టర్లుగా విభజించారు. క్లస్టర్ పరిధిలో సిబ్బంది సేవలందించనున్నారు. ఇప్పటికే ప్రతీ సచివాలయంలో హేతుబద్దీకరణకు అనుగుణంగా పోస్టింగులు ఖరారు చేశారు. అదే పోస్టింగులు ఐదేళ్లు పూర్తయిన ఉద్యోగి ఉంటే వేరే చోటకు బదిలీ చేస్తారు. సదరు పోస్టింగ్లో ఇతర సచివాలయాల నుంచి బదిలీపై నియమిస్తారు. మరోవైపు ఐదేళ్లు పూర్తి కాకపోయినా ఉద్యోగి అభ్యర్ధన మేరకు బదిలీ చేసే అవకాశం ఉంది. జిల్లాలో నాలుగు వేల 200 మంది ఈ సచివాలయాల్లో పనిచేస్తున్నారు. గతంలో కొందరికి బదిలీలపై ఇతర సచివాలయాలకు వెళ్లారు. వారికి ఐదేళ్లు పూర్తి కాలేదు. తాజాగా ఐదేళ్లు పూర్తయిన ఉద్యోగికి బదిలీ తప్పనిసరి చేశారు. ఈ నిబంధన ఆధారంగా బదిలీకి అర్హత ఉన్న ఉద్యోగుల జాబితాను సిద్ధం చేస్తున్నారు.
వీరికి ప్రాధాన్యం
బదిలీల్లో దృష్టి లోపం, వినికిడి, ఇతర సమస్యలు వున్న దివ్యాంగులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. ఆర్యోగ సమస్యలు వున్న వారికి ఇదే వర్తిస్తుంది. దృష్టి లోపం వున్న ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. సదరు ఉద్యోగి విజ్ఞాపన మేరకు బదిలీ చేయాలని దిశా నిర్ధేశం చేసింది. కోరుకున్న చోట ఖాళీ ఉండాలి. ఇలా పలు మార్గదర్శకాలను సూచించింది. దీనికి అనుగుణంగానే బదిలీలు చేయాల్సి ఉంది. ఈ బదిలీలు మునిసిపాల్టీలు వారీగానా, లేదా జిల్లా ప్రాతిపదికన అనేదానిపై స్పష్టత రావాల్సి వుంది. గ్రామ సచివాలయాల్లోను ఇదే గందరగోళం ఉంది.
మేం ఇక్కడ పనిచేయలేం !
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లా వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొంది న ఆ పట్టణ మునిసిపల్ అధికారి తీరుతో వార్డు సచివాలయ సిబ్బంది హడలిపోతున్నారు. ఆ అధికారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత 15 మంది మెడికల్ లీవ్లు పెట్టారు. సెలవులకు అనుమతి ఇవ్వకపోవడంతో ఈ లీవ్ను రిజిస్టర్ పోస్టులో పంపుతున్నారు. విధుల్లో హాజరైతే సెలవులకు సంబంఽధించిన వేతనాన్ని నిబంధనల మేరకు ఇవ్వాలి. కానీ, ఆ అధి కారి వాటిని మెడికల్ లీవ్కు అర్హత ఉందా ? లేదా ? అని నిర్ధారిం చాలంటూ బోర్డును కోరుతున్నారు. వీటిపై బోర్డు అధికారులు అంత గా స్పందించలేదు. ఫలి తంగా ఉద్యోగులకు మెడి కల్ లీవ్ వేతనం, ఇతర బిల్లులు మంజూరు కావ డం లేదు. విధుల పేరుతో ఒత్తిడి పెంచుతున్నారని సిబ్బంది ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తాజాగా ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల బదిలీలకు అనుమతి ఇవ్వడంతో సదరు మున్సిపాలిటీని వదిలి పెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నారు. ఐదేళ్లు దాటిన వారంతా వెళ్లిపోవాలి. అలాగని ఇటీవల బదిలీపై వచ్చిన వారు సైతం ఇప్పుడు అభ్యర్థన పెట్టుకుని ఇతర మున్సిపాలిటీలకు వెళ్లిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర మున్సిపాలిటీ ల్లో సచివాలయ సిబ్బంది ఈ పట్టణానికి రావడానికి ఆసక్తి చూపడం లేదు. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.