అభివృద్ధే ఆకర్షిస్తోంది..
ABN , Publish Date - Jun 15 , 2025 | 12:27 AM
నూజివీడు ఎంపీపీ ఆరేపల్లి శిరీష శనివారం మంత్రి కొలుసు పార్థసారథి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు.

మంత్రి కొలుసు పార్థసారథి
నూజివీడు, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : నూజివీడు ఎంపీపీ ఆరేపల్లి శిరీష శనివారం మంత్రి కొలుసు పార్థసారథి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఎంపీపీ శిరీషతో పాటు మరో 40 మంది వైసీపీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభవృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీ సభ్యుత్వం తీసుకొన్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా నెరవేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందనారు. దూరదృష్టి, పరిపాలనా దక్షకుడు అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి వచ్చే ప్రతీవారికి ప్రత్యేక గౌరవం తెలుగుదేశం పార్టీ ఇస్తుందని మంత్రి అన్నారు.