తల్లికి ఆనందం
ABN , Publish Date - Jun 14 , 2025 | 01:08 AM
ముందుగా చెప్పినట్లు పిల్లలందరికీ సొమ్ములు వేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం ఒక ఇంట్లో ముగ్గురు ఉన్నా ఒకరికే ఇచ్చేవారు. ఆఖరికి బూట్లు, యూనిఫాం, బ్యాగ్ నాణ్యత లేనివి ఇచ్చేవారు. కొద్దికాలానికే అవి పాడైపోయాయి. ఇప్పుడు మాత్రం లోకేశ్ చొరవతో సక్రమంగా జరుగుతున్నట్లు తెలుస్తోందని ఏలూరుకు చెందిన సాంబశివరావు ఆనందం.

మారుమూల గ్రామాల్లోనూ వందనం
కొందరికి సొమ్ములు జమ కాక నిరాశ
వివరణ ఇచ్చేవారు లేక తల్లుల ఆందోళన
ముందుగా చెప్పినట్లు పిల్లలందరికీ సొమ్ములు వేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం ఒక ఇంట్లో ముగ్గురు ఉన్నా ఒకరికే ఇచ్చేవారు. ఆఖరికి బూట్లు, యూనిఫాం, బ్యాగ్ నాణ్యత లేనివి ఇచ్చేవారు. కొద్దికాలానికే అవి పాడైపోయాయి. ఇప్పుడు మాత్రం లోకేశ్ చొరవతో సక్రమంగా జరుగుతున్నట్లు తెలుస్తోందని ఏలూరుకు చెందిన సాంబశివరావు ఆనందం.
చంద్రబాబు ఇచ్చిన మాట తప్పలేదు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పినట్లు సొమ్ములు జమ కావడం నిజంగా అద్భుతం. చంద్రన్న మీరు చల్లగా ఉండాలని హసీనా బేగం దీవించారు.
(ఏలూరు, ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
జిల్లా వ్యాప్తంగా వేలాది కుటుంబాల్లో అంతులేని ఆనందం. ఎంతమందిని చదివిస్తే అంతమంది తల్లులకు తెలుగుదేశం సర్కారు వందనం వేసింది. తల్లుల ఖాతాల్లో సొమ్ములు జమ చేసింది. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఆనందం నింపింది. తల్లికి వందనం పథకంలో తల్లుల ఖాతాల్లో సొమ్ములు ఎప్పుడు జమ అవుతాయని చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు. బడులు తెరిచిన రోజే తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామంటూ తన మాటను సీఎం చంద్రబాబు అక్షరాల రుజువు చేశారు. జిల్లాలో ఎక్క డికక్కడ తమ ఖాతాలను చూసుకున్నారు. కొందరు ఆనందంతో పొంగిపోతే, ఇంకొందరు నిరాశ చెందారు. సంబంధిత శాఖాధికారులు మాత్రం అయోమ యానికి గురవుతున్న తల్లులకు వివరణ ఇచ్చేందుకు కూడా సిద్ధం కాలేకపోయారు.
ఒకప్పుడు ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంత మంది ఉన్నా ఒకరికి మాత్రమే తల్లుల ఖాతాలో సొమ్ములు జమ అయ్యేవి. సవాలక్ష తనిఖీలతో ఖాతాలో సొమ్ము వేయడానికి ముప్పుతిప్పలు పెట్టే వారు. చదువును ప్రోత్సహించేందుకు తల్లిదండ్రులను సమయాత్తపరిచేందుకు, పిల్లలను బడి బాట పట్టిం చేందుకు తెలుగుదేశం ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమల్లోకి తెచ్చింది. ఎన్నికల సమయంలో ఒకటో తరగతి నుంచి ఎంతమంది చదువుతున్నా అంతమందికి తల్లికి వందనం పేరిట రూ.15 వేలు జమ చేస్తామని కూటమి నేతలంతా హామీ నిచ్చారు. అందుకు అనుగుణంగానే కొన్నాళ్ల పాటు ప్రభుత్వ ప్రకటనల కోసం ఎదురుచూస్తూ వచ్చారు. ప్రత్యేకిం చి మారుమూల పల్లెల్లో విద్యార్థుల తల్లిదండ్రులంతా తమ పిల్లలకు వారి ఖాతాలో జమ అవుతాయని ఎదురుచూశారు. పల్లెలకు వస్తున్న రాజకీయ పెద్ద్దల ను ఆరా తీస్త్తూవచ్చారు. బడులు తెరిచిన నాడే తల్లికి వందనం సొమ్ములు తల్లుల ఖాతాలో జమ అవుతా యని సీఎం చంద్రబాబు స్పష్టం చేస్తూ వచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రం గా ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం తల్లుల ఖాతాలో సొమ్ములు జమ చేసి తీరుతామని స్పష్టం చేస్తూ వచ్చారు. దీనికి అనుగుణంగానే శుక్రవారం నాటికి చాలామంది తల్లుల ఖాతాల్లో ఒక్కొక్క విద్యార్థికి రూ.13 వేలు చొప్పున డబ్బులు జమ అయ్యాయి.
ప్రత్యేకించి గతంతో పోల్చితే ఈసారి సొమ్ములు అందుకున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో అమ్మఒడి పథకంలో నాలుగేళ్ల పాటు 1,78,214 మంది విద్యార్థుల తల్లులకే సొమ్ములు జమ చేశారు. కూటమి ప్రభుత్వంలో మాత్రం ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒకే ఇంటిలో చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం వర్తింపు చేస్తామని ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగు లు వేయడంతో ఆ మేరకు విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. సుమారు 2,15,082 మంది విద్యా ర్థులకు రూ.13 వేలు చొప్పున చేతికి అందినట్లయింది. గత ప్రభుత్వంలో సొమ్ములు అందుకున్న విద్యార్థుల సంఖ్యకు ఇప్పటికి దాదాపు అధికంగా ఉన్నట్లయింది. జిల్లాలో ఎక్కడ చూసినా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో సంతోషం వ్యక్తమైంది. కొందరు నేరుగా ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరికొందరు తమ పిల్లలను అక్కున చేర్చుకుని సంతోషపడ్డారు.
తల్లుల ఖాతాల్లో అత్యధికులకు నగదు జమయ్యా యి. మరి మా సంగతి ఏమిటి, జిల్లా వ్యాప్తంగా ముగ్గురు లేదా ఇద్దరున్న కుటుంబాల్లో కొందరికి సొమ్ము జమ కాలేదు. కొన్ని మండలాల్లో అందరికీ సొమ్ము అందగా లింగంపాలెం, ఇతర మండలాల్లో మాత్రం శుక్రవారం పొద్దుపోయే వరకూ ఖాతాల్లో జమ కాకపోవడంతో తల్లుల్లో ఆందోళన వ్యక్తమవు తోంది. ఇప్పటి వరకూ దీనికి సంబంధించి అధికారులు కూడా ఎటువంటి వివరణలతో ముందుకు రాకపో వడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదంతా సోమవారం నాటికి సర్దుబాటవుతుందంటున్నారు.
కూటమి ప్రభుత్వంలో ఆనందంగా ఉంది..
కొయ్యలగూడెం: చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం పేరుతో కూటమి ప్రభుత్వం డబ్బులు వేయ డం ఆనందంగా ఉందని కన్నాపురం గ్రామానికి చెం దిన తండ్రి నులకాని ప్రసాద్ అన్నారు. ప్రసాద్కు నలుగురు పిల్లలు కాగా ముగ్గురు పిల్లలకు తల్లికి వందనం డబ్బులు రూ.39 వేలు పడ్డాయి. సాయి దుర్గ జడ్పీ పాఠశాలలో 7వ తరగతి, శ్రీరుతి క ఎంపీపీ పాఠశాలలో 5వ తరగతి, లక్ష్మీ 3వ తరగతి చదువుతున్నారు. ముగ్గురికి ఒకేరోజు డబ్బులు పడటంతో ఆ కుటుంబం ఎంతో ఆనందనం వ్యక్తం చేశారు.