ఆరోరోజుకు చేరుకున్న కార్మికుల సమ్మె
ABN , Publish Date - Jun 15 , 2025 | 12:06 AM
తమ సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ తాగునీటి సరఫరా కార్మికులు చేపట్టిన సమ్మె ఆరో రోజుకు చేరుకుంది.

పార్వతీపురంటౌన్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ తాగునీటి సరఫరా కార్మికులు చేపట్టిన సమ్మె ఆరో రోజుకు చేరుకుంది. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ కార్మిక సంఘ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆ సంఘ అఽధ్యక్షుడు వినయ్ మా ట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం కోరుతు న్నా కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు.