ఆలయంలోకి మురుగునీరు
ABN , Publish Date - Jun 15 , 2025 | 12:03 AM
కురుపాంలో శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి బస్టాండ్లో ఉన్న త్రినాథస్వామి దేవాలయంలోకి మురుగునీరు చేరిపోయింది.

కురుపాం, జూన్ 14(ఆంధ్రజ్యోతి): కురుపాంలో శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి బస్టాండ్లో ఉన్న త్రినాథస్వామి దేవాలయంలోకి మురుగునీరు చేరిపోయింది. గత వారం రోజులుగా ఇది రెండోసారి కావడం విశేషం. కురుపాంలో రోడ్డు, కాలువ పనులను ఇష్టారాజ్యంగా చేయడం.. అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగా ఇలా జరిగనట్టు తెలుస్తోంది. దీనిపై మే 18న ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైనప్పటికీ ఎవరూ స్పందిం చలేదు. ఇప్పటికైనా కాలువ నిర్మాణం సక్రమంగా చేపట్టి, ఆలయంలోకి నీరు వెళ్లకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.