Ready for the toli adugu ‘తొలి అడుగు’కు సన్నద్ధం
ABN , Publish Date - Jun 14 , 2025 | 11:51 PM
Ready for the toli adugu అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 23 నుంచి ‘తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహించాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారు. నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఇప్పటికే పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు.

23 నుంచి ప్రజల్లోకి వెళ్లనున్న టీడీపీ శ్రేణులు
జిల్లాలో నెలరోజుల పాటు కార్యక్రమం నిర్వహణ
పథకాలు, అభివృద్ధి పనులు, హామీల అమలుపై విస్తృత ప్రచారం
ప్రత్యర్థి పార్టీల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టనున్న నాయకులు
పార్వతీపురం, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 23 నుంచి ‘తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహించాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారు. నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఇప్పటికే పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. ఏడాదిలో సాగించిన ప్రగతి, చేపట్టిన అభివృద్ధి కార్యక్ర మాలపై ఇంటింటి ప్రచారం చేయాలని, ప్రజల్లోకి వెళ్లి అమలు చేసిన సంక్షేమ పథకాలను వివ రించాలని సూచించారు. ఇందులో లీడర్ నుంచి కేడర్ వరకూ ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రచారం చేసే విషయంలో పోటీ పడాలని నిర్దేశించారు. ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు సన్నద్ధమవుతున్నారు. ‘తొలి అడుగు’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏడాదిలో నెరవేర్చిన హామీలివీ..
- ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం సామాజిక పింఛన్ల సొమ్ము పెంచి ఎన్టీఆర్ భరోసా కింద ప్రభుత్వం లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తుంది. జిల్లాలో 1,39,111 మందికి ప్రతినెలా వివిధ రకాల పింఛన్ల కోసం రూ.59.32 కోట్లను విడుదల చేస్తుంది.
- ఇంట్లో చదువుకున్న పిల్లలందరికీ తల్లికి వందనం పథకం వర్తింపజేశారు. ఒక్కొక్కరికీ రూ.13 వేలు చొప్పున అందించారు. జిల్లాలో 69,600 మంది తల్లుల ఖాతాలకు నగదు జమ చేశారు.
- ఉమ్మడి జిల్లాలో గత ఏడాది ఖరీఫ్ కాలంలో 37,491 మంది రైతుల నుంచి 2,24,292 మె ట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేశారు. గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రూ.517 కోట్లను రైతులకు అందించారు.
- దీపం-2 పథకం కింద జిల్లాలో 52,062 మంది లబ్ధిదారులకు ఉచితంగా వంట గ్యాస్ సిలిండర్లను కూటమి ప్రభుత్వం అందించింది. నాలుగు నెలలకు ఒకటి చొప్పున ఉచిత సిలిండర్ అందిస్తుండగా.. ఇప్పటివరకు ప్రభుత్వం వారి ఖాతాల్లో రూ.నాలుగు కోట్ల పది లక్షలను జమ చేసింది.
- ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి నిర్మాణ రంగానికి ఊతమిచ్చింది. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి చూపింది. మధ్యతరగతి, సామాన్యుల సొంతింటి కల నెరవేర్చ దిశగా చర్యలు చేపట్టింది.
- పార్వతీపురం, పాలకొండలో అన్నాక్యాంటీన్లను నిర్వహిస్తుండగా.. సాలూరులో కూడా త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.
- విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకానికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు.
- కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ప్రస్తుతం మెగా డీఎస్సీని నిర్వహిస్తోంది.
- ‘మనమిత్ర’ పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 13 శాఖల పరిధిలో 250కిపైగా సేవలను ప్రజలకు అంది స్తోంది.
- ఏజెన్సీలో దారి లేని గిరిజన గ్రామాల ప్రజలకు తక్షణ వైద్యసేవలందించడానికి ఫీడర్ అంబులెన్స్లను అందుబాటులోకి తెచ్చారు. పైలెట్ ప్రాజెక్ట్గా ఏవోబీలో గిరిశిఖర గ్రామం కరడవలసలో కంటైనర్ ఆసుపత్రి (గిరి ఆరోగ్య కేంద్రం) ఏర్పాటు చేశారు. మారుమూల, గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కోట్లాది రుపాయలు వెచ్చిస్తోంది.
- జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు భారీగా నిధులు మంజూరు చేసింది.
- ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను తొలి అడుగు కార్యక్రమం ద్వారా టీడీపీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు ప్రజలకు వివరించ నున్నారు.