గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:20 AM
సాలూరు మీదుగా మల్కనగిరి నుంచి చెన్నైకి గంజాయి తరలిస్తున్న పలువురిని పట్టణ పోలీసులు పట్టుకున్నారు.

సాలూరు, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): సాలూరు మీదుగా మల్కనగిరి నుంచి చెన్నైకి గంజాయి తరలిస్తున్న పలువురిని పట్టణ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 17 కేజీల 330 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీ సుల కథనం మేరకు.. పట్టణంలోని ఓల్డ్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని స్థానిక పోలీసులు శనివారం పట్టుకు న్నారు. తమిళనాడుకు చెందిన వివేక్, మల్లిక, ఒడిశాకు చెందిన అంతల్ సీతా రాం, మల్కనగిరికి చెందిన సురేంద్ర హ్యాంటల్గా గుర్తించారు. వారి వద్ద బ్యాగు లో ఉన్న 17 కేజీ 330లు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నలుగురిపై పట్టణ సీఐ అప్పలనాయుడు కేసు నమోదుచేసి నిందితులను రిమాండ్కు తరలించారు.