రైల్వే స్టేషన్లో ‘జల్ సేవ’
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:02 AM
బొబ్బిలి రైల్వే స్టేషన్లో సోమవారం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారులు, సిబ్బంది జల్ సేవ కార్యక్రమాన్ని చేపట్టారు.

బొబ్బిలి, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి రైల్వే స్టేషన్లో సోమవారం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారులు, సిబ్బంది జల్ సేవ కార్యక్రమాన్ని చేపట్టారు. రైళ్లలో ఉన్న, ప్లాట్ఫామ్లపై వేచిఉన్న ప్రయాణికులకు గ్లాసులతో తాగునీరు అందజేశారు. ఎండలు తీవ్రంగా ఉన్నన్ని రోజులు ఈ జల్సేవ కొనసాగిస్తామని తెలిపారు.
భద్రతా పరమైన అంశాల పరిశీలన..
ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఇన్చార్జి పీసీ పండా ఆధ్వర్యంలో ఆర్పీఎఫ్, జీపీఎఫ్ పోలీసులు స్థానిక రైల్వే స్టేషన్లో భద్రతా పరమైన అంశాలను పరిశీలించారు. ప్రయాణికుల లగేజీలను తనిఖీ చేశారు.సీసీ టీవీల పనితీరును పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టామని తెలిపారు.