పిల్లల చదువుకు భరోసా
ABN , Publish Date - Jun 14 , 2025 | 11:50 PM
పట్టణంలోని గవిడి వీధికి చెందిన విద్యార్థుల తల్లులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చిత్రపటా నికి శనివారం పాలభిషేకం చేశారు.

- ‘తల్లికి వందనం’ నిధులు విడుదలపై మహిళల హర్షం
- చంద్రబాబు చిత్రపటానికి పాలభిషేకం
చీపురుపల్లి, జూన్ 14 (ఆంధ్రజ్యో తి): పట్టణంలోని గవిడి వీధికి చెందిన విద్యార్థుల తల్లులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చిత్రపటా నికి శనివారం పాలభిషేకం చేశారు. తల్లికి వందనం పథకంలో భాగంగా తమ ఖాతాల్లోకి నగదు జమ కావ డంతో చంద్రబాబుకు వారు ధన్యవా దాలు తెలిపారు. పేద కుటుంబాల్లోని పిల్లల చదువుకు ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యురాలు గవిడి భారతి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గవిడి నాగరాజు, ఎస్.కనకరాజు, శ్రీనివాసరావు, రాము నాయుడు, కోలా రాము, గవిడి సాయి, చిలూకూరు శేఖర్, గవిడి జయ, రూపవతి తదితరులు పాల్గొన్నారు.