తాగునీరు సరఫరా చేయాలి
ABN , Publish Date - Jun 15 , 2025 | 12:04 AM
తాగునీటి సరఫరా చేయక పోతే ఊరుకునేది లేదని నాలుగో వార్డు భారత భవనం వీధికి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.

పార్వతీపురంటౌన్, జూన్ 14(ఆంధ్రజ్యోతి): తాగునీటి సరఫరా చేయక పోతే ఊరుకునేది లేదని నాలుగో వార్డు భారత భవనం వీధికి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. గత 5 రోజులుగా కుళాయిల ద్వారా తాగునీటి సరఫరా జరగకపోవడంపై ఆ వీధి మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టణ నడిబొడ్డులో ఉన్న తమలాంటి ప్రజలకే ఇలాంటి బాధలు ఉంటే శివారులోఉన్న ప్రజలు ఇంకెన్ని బాధలు పడుతున్నారోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నాటికి తాగునీటి సరఫరా జరగకపోతే సోమవారం మున్సిపల్ కార్యాలయాన్ని దిగ్భంధం చేస్తామని, హెచ్చరించారు.