Share News

అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల జాబితాపై కసరత్తు

ABN , Publish Date - Jun 14 , 2025 | 10:59 PM

అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల తుది జాబితా తయారీపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 2,33,570 మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు.

అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల జాబితాపై కసరత్తు
సబ్బవరం మండలం నంగినారపాడు గ్రామంలో రైతులకు ఈకేవైసీ చేస్తున్న సిబ్బంది

ఈకేవైసీ నమోదు చేస్తున్న వ్యవసాయ సిబ్బంది

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల తుది జాబితా తయారీపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 2,33,570 మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులకు ఈకేవైసీ ప్రక్రియ చేపడుతున్నారు. జిల్లాలో రెండు రోజుల్లో 8,893 మంది రైతుల ఈకేవైసీ పూర్తి చేశారు. ఈ నెల 18వ తేదీలోగా ఈ ప్రక్రియ ముగించి అర్హుల తుది జాబితా తయారు చేసి ప్రభుత్వానికి జిల్లా వ్యవసాయాధికారులు నివేదించనున్నారు. లబ్ధిదారులకు ఏడాదిలో మూడు విడతల్లో రూ.20 వేలు ఇవ్వనున్నారు. ఈ నెల 20న తొలి విడత రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.7 వేలు జమ చేయనున్నారు.

Updated Date - Jun 14 , 2025 | 10:59 PM