సీలేరులో రాష్ట్ర స్థాయి కబడ్డీ, టగ్ ఆఫ్ వార్ పోటీలు
ABN , Publish Date - Aug 02 , 2025 | 11:31 PM
జీకేవీధి మండలం సీలేరులో ఏపీ జెన్కో ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు రాష్ట్ట్ర స్థాయి ఇంటర్ సర్కిల్ కబడ్డీ, టగ్ ఆఫ్ వార్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్టు స్థానిక జెన్కో స్పోర్ట్స్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు తెలిపారు.

5 నుంచి జెన్కో ఆధ్వర్యంలో నిర్వహణ
రెండు పోటీల్లో పాల్గొనున్న 30 జట్లు
సీలేరు, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం సీలేరులో ఏపీ జెన్కో ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు రాష్ట్ట్ర స్థాయి ఇంటర్ సర్కిల్ కబడ్డీ, టగ్ ఆఫ్ వార్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్టు స్థానిక జెన్కో స్పోర్ట్స్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ పోటీల్లో ఏపీ జెన్కో, ట్రాన్స్కో, డిస్కంలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలు మూడు రోజుల పాటు ఫ్లడ్లైట్ల కాంతుల్లో నిర్వహించనున్నామన్నారు. ఈ పోటీల్లో 20 కబడ్డీ జట్లు, టగ్ ఆఫ్ వార్లో 10 జట్లు పాల్గొంటాయన్నారు. క్రీడాకారులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. క్రీడల నిర్వహణపై స్థానిక జెన్కో ఎస్ఈ కార్యాలయంలో స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్, ఎస్ఈ చంద్రశేఖర్తో చర్చించామని శ్రీనివాసరావు తెలిపారు.