Share News

Minister Anitha: ఆపరేషన్ సిందూర్ ప్రపంచ పటముపై మరోసారి నిలిపింది: అనిత

ABN , Publish Date - May 07 , 2025 | 01:57 PM

operation sindoor: ఉగ్రవాదానికి శాశ్వతంగా ముగింపు వచ్చే వరకు భారతదేశం తన ఆపరేషన్‌లను కొనసాగిస్తుందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఇకనైనా చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వడం నిలిపివేయాలని, దేశ రక్షణలో ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చూపుతున్న కట్టుదిట్టమైన విధానం అభినందనీయమని వంగలపూడి అనిత కొనియాడారు.

Minister Anitha: ఆపరేషన్ సిందూర్ ప్రపంచ పటముపై మరోసారి నిలిపింది: అనిత
Home Minister Vangalapudi Anitha

విశాఖపట్నం: భారత సైన్యం (Indian Army) పాకిస్తాన్ (Pakistan) భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలను (Terrorist bases) ధ్వంసం చేయడంపై హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా బుధవారం విశాఖ (Visakha)లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ (operation sindoor) భారత దేశ గౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని ప్రపంచ పటముపై మరోసారి నిలిపిందని కొనియాడారు. పహల్గామ్ దాడికి భారతదేశం సాహసోపేతంగా తగిన ప్రతీకారం తీర్చుకుందన్నారు. ఉగ్రవాదానికి శాశ్వతంగా ముగింపు వచ్చే వరకు భారతదేశం తన ఆపరేషన్‌లను కొనసాగిస్తుందని ఆమె స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఇకనైనా చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వడం నిలిపివేయాలని, దేశ రక్షణలో ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చూపుతున్న కట్టుదిట్టమైన విధానం అభినందనీయమని వంగలపూడి అనిత అన్నారు.


ఏ సమయంలోనైనా యుద్ధం..

కాగా ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో ఆనందోత్సవాలు జరుపుకున్నారు. మహాత్మగాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండాలతో భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. భారత సైన్యానికి జాతీయ జెండాలతో ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఏ సమయంలోనైనా యుద్ధం వచ్చే అవకాశం ఉందన్నారు. శాంతియుత దేశమైన భారతదేశంలో దుశ్చర్యలకు పాల్పడుతున్న వారికి సరైన గుణపాఠం చెప్పాలన్నారు. భారత సైన్యానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.

Also Read: Pawan Kalyan: ప్రతి భారతీయుడు హర్షించదగ్గ పరిణామం


భారత సైన్యాన్ని అభినందిస్తున్నాం..

పహల్గామ్‌లో మతం ఆధారంగా 26 మంది పౌరులను చంపడానికి ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పీవోకేలోని 9 ఉగ్రవాద శిబిరాలపై వారి పౌరులకు హాని కలిగించకుండా ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు భారత సైన్యాన్ని అభినందిస్తున్నామని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు ఛైర్మెన్ ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంక దినకర్ అన్నారు. శాంతి కోసం ఉగ్రవాదులను నిర్మూలించడానికి మన సైన్యం ప్రయత్నాలకు నైతికంగా మద్దతు ఇవ్వడానికి మనం అందరం ముందుండాలని పిలుపిచ్చారు. భారతమాతా కీ జై … జై హింద్… అంటూ ఆయన ట్వీట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పహల్గామ్ దాడిలో మరో కుట్ర..

ఆపరేషన్ సింధూర్‌పై చిరంజీవి ట్వీట్

ఎమర్జెన్సీ ప్రకటించిన పాకిస్తాన్..

For More AP News and Telugu News

Updated Date - May 07 , 2025 | 01:57 PM