Kurnool: పోస్టాఫీసులకు పోటెత్తిన తల్లులు
ABN , Publish Date - Jun 18 , 2025 | 05:11 AM
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ‘తల్లివందనం’ పథకంలో భాగంగా తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసింది. ఈ నగదు విత్డ్రా చేసుకునేందుకు మహిళలు బ్యాంకులు, పోస్టాఫీసులకు పోటెత్తారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ‘తల్లివందనం’ పథకంలో భాగంగా తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసింది. ఈ నగదు విత్డ్రా చేసుకునేందుకు మహిళలు బ్యాంకులు, పోస్టాఫీసులకు పోటెత్తారు. కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో మంగళవారం తల్లులు తమ ఖాతాల్లోని నగదును తీసుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన చిత్రమిది. మహిళలను నియంత్రించేందుకు పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగదు డ్రా చేసుకున్న అనంతరం తల్లులు పిల్లలకు బ్యాగులు, పుస్తకాలతో పాటు బంగారం, బట్టలు కొనుగోలు చేశారు.