Edit Option Online: టీచర్ల బదిలీల్లో ఎడిట్ ఆప్షన్
ABN , Publish Date - May 26 , 2025 | 04:09 AM
ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో సవరణలకు ఆన్లైన్ ఎడిట్ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఎంఈవోల లాగిన్ ద్వారా సవరణలు చేసి, ఆమోదం తరువాత డీఈవోకు పంపించే విధంగా మార్పులు చేశారు.

అమరావతి, మే 25(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియలో సవరణలకు ఆన్లైన్లో ఎడిట్ అవకాశం కల్పించారు. సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు ఎంఈవోల లాగిన్లో మార్పులకు అవకాశం ఇచ్చారు. మార్పుల అనంతరం ఎంఈవో లాగిన్లో ఆమోదం తెలిపితే దరఖాస్తులు డీఈవో లాగిన్కు వెళ్తాయి. ఆ తర్వాత తాత్కాలిక సీనియారిటీ జాబితా విడుదల చేస్తారు. అలాగే ప్రస్తుత స్టేషన్లో ఎంతకాలం పనిచేసినా గరిష్టంగా ఎనిమిదేళ్లకు మాత్రమే బదిలీ పాయింట్లు ఇస్తారు. ఉమ్మడి జిల్లాల ప్రామాణికంగానే ఉపాధ్యాయ సంఘాల నాయకులకు ప్రత్యేక పాయింట్లు ఇస్తారు.