యువత రక్తదానం చేయాలి: డీఎస్పీ
ABN , Publish Date - Jun 15 , 2025 | 12:01 AM
యువత రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందు కు రావాలని కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు కోరారు.

పలాస, జూన్ 14(ఆంధ్రజ్యోతి): యువత రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందు కు రావాలని కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు కోరారు. రక్తదాతల దినోత్సవం సందర్భంగా స్థానిక జీడి-రైస్ కార్మిక భవన్లో ఆ నలుగురు సేవా ట్రస్టు ఆధ్వర్యంలో శని వారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 20 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘ అధ్యక్షుడు అం బటి కృష్ణమూర్తి, ట్రస్టు నిర్వాహకులు సానా ఈశ్వరరావు, టెంక తేజేశ్వరరావు, నరేష్, మన్మఽథ, వేణు, బొంపల్లి సింహాచలం, కోనారి రాము, నాగేశ్వరరావు, మోహన్ పాల్గొన్నారు.
ఓంశాంతి భవనంలో..
మెళియాపుట్టి, జూన్ 14( ఆంధ్రజ్యోతి): చాపర ఓంశాంతి భవనంలో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరం నిర్వ హించారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా పలువురు యువకులు రక్తదానం చేశారు. రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు అవకాశం కలుగు తుందని సంస్థ ప్రతినిధులు అన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో బ్రహ్మ కుమారి సుధారాణి, రెడ్క్రాస్ సిబ్బంది తది తరులు పాల్గొన్నారు.