Share News

Neet result: నీట్‌లో సిక్కోలు సత్తా

ABN , Publish Date - Jun 15 , 2025 | 12:21 AM

Srikakulam students NEET toppers వైద్య విద్యకు సంబంధించిన నీట్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకు సాధించారు. అరసవల్లిలో వెలమవీధిలో నివాసముంటున్న పొదిలాపు అవినాష్‌ ఆల్‌ఇండియా 64వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఓబీసీ కేటగిరిలో 15వ ర్యాంకు సాధించాడు.

Neet result: నీట్‌లో సిక్కోలు సత్తా
అవినాష్‌, యువరాజ్‌, మేఘసాయి వర్థన్‌, మైత్రి, జుహిత, ఝాన్సీలక్ష్మీశృతి

  • జిల్లా విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు

  • శ్రీకాకుళం/ వజ్రపుకొత్తూరు/ సోంపేట/ పోలాకి/ జలుమూరు/ నరసన్నపేట, జాన్‌ 14(ఆంధ్రజ్యోతి): వైద్య విద్యకు సంబంధించిన నీట్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకు సాధించారు. అరసవల్లిలో వెలమవీధిలో నివాసముంటున్న పొదిలాపు అవినాష్‌ ఆల్‌ఇండియా 64వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఓబీసీ కేటగిరిలో 15వ ర్యాంకు సాధించాడు. దీంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధుల్లేవు. తండ్రి శ్రీనివాసరావు ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తూ.. వ్యాపారం చేస్తున్నారు. అవినాష్‌ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు శ్రీకాకుళంలో.. పదో తరగతి వరకు కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో చదివాడు. ఇంటర్‌ విజయవాడలో పూర్తిచేసి నీట్‌లో మెరిశాడు. ఎంబీబీఎస్‌ చేసి.. ఆపై పీజీ చేసి ప్రజలకు ఉపయోగపడాలన్నదే తన లక్ష్యమని అవినాష్‌ వెల్లడించాడు.

  • వజ్రపుకొత్తూరు మండలం అమలపాడు గ్రామానికి చెందిన దున్న యువరాజ్‌ నీట్‌ జనరల్‌ విభాగంలో 207 ర్యాంక్‌, ఓబిసి విభాగంలో 51వ ర్యాంక్‌ సాధించాడు. మొత్తం 720 మార్కులకుగాను 632 మార్కులు పొందాడు. యువరాజ్‌ తండ్రి దున్న లక్ష్మీనారాయణ ప్రైవేటు ఉద్యోగి కాగా తల్లి కుమారి ఏఎన్‌ఎం. యువరాజ్‌కు మంచి ర్యాంకు రావడంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • సోంపేటకు చెందిన మేఘసాయి వర్థన్‌ నీట్‌లో ఆలిండియా స్థాయిలో 942వ ర్యాంకు, ఓబీసీ కోటాలో 277 ర్యాంకు సాధించాడు. మేఘసాయి వర్థన్‌కు తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు అభినందనలు తెలిపారు. లుపుతున్నారు.

  • పోలాకి మండలం తోటాడ గ్రామానికి చెందిన తర్ర మైత్రి ఆల్‌ ఇండియా స్థాయిలో 2,672 ర్యాంక్‌, ఓబీసీ కేటగిరీలో 948 వర్యాంక్‌ సాధించింది. ఈమె తల్లి చింతు ప్రభావతి.. శాలిహుండం కేజీబీవీ ఉపాధ్యాయురాలు. తండ్రి వైకుంఠరావు గుజరాతీపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

  • సారవకోట మండలం అలుదు గ్రామానికి చెందిన పాగోటి జుహిత నీట్‌ ఫలితాల్లో ఆలిండియాలో 2,744 వ ర్యాంకు సాధించింది. తండ్రి మురళీధరరావు బ్యాంకు ఉద్యోగి కాగా తల్లి హేమలత గృహిణి. జుహితను కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.

  • నరసన్నపేటలోని మారుతీనగర్‌కు చెందిన సూరపు ఝన్సీలక్ష్మీశృతి నీట్‌ ఫలితాల్లో ఆలిండియాలో 3,202వ ర్యాంకు సాధించింది. ఝన్సీలక్ష్మీశృతి తండ్రి డా. క్రిష్ణరావు పాతపట్నం సామాజిక ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. తల్లి మెండ సుధారాణి నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో చిన్నపిల్లలు వైద్యనిపుణులు. తల్లిదండ్రుల మాదిరి ప్రజలకు వైద్యసేవలను అందించడమే తన లక్ష్యమని ఝాన్సీ లక్ష్మీశృతి తెలిపారు.

Updated Date - Jun 15 , 2025 | 12:21 AM