వంశధార సాగునీటి కోసం ఉద్యమం
ABN , Publish Date - Jun 15 , 2025 | 12:02 AM
ఇచ్ఛా పురం వరకు వంశధార నీటిని తరలించేం దుకు ఉద్యమం చేపడతామని సాగునీటి సాధ న కమిటీ అధ్యక్షుడు మార్పు మన్మఽథ రావు అన్నారు.

హరిపురం, జూన్ 14(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛా పురం వరకు వంశధార నీటిని తరలించేం దుకు ఉద్యమం చేపడతామని సాగునీటి సాధ న కమిటీ అధ్యక్షుడు మార్పు మన్మఽథ రావు అన్నారు. కుంటికోట, అచ్యుతాపురం, వాసు దేవుపురం గ్రామాల్లో శనివారం రైతులతో సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామా ల్లో ర్యాలీలు నిర్వహించారు. ఈ ప్రాంతం సస్య శ్యామలం కావాలంటే తాగు, సాగు నీటి ఇబ్బందులు తొలగాలంటే వంశధారను ఇచ్ఛా పురం వరకు పొడిగించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. వంశఽధార, మహేంద్రతనయ, బాహుదా నదుల అనుసంధానం చేయాలని కోరారు. ఈ విష యమై ఎమ్మెల్యే శిరీష దృష్టికి తీసుకువెళ్లామన్నారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు హేమారావు చౌదరి, నల్ల హడ్డీ, వైకంఠరావు, పాపారావు, సోమనాథం, పలువు రు రైతులు తదితరులు పాల్గొన్నారు.