Raghu Rama Krishna: ప్రజలపై ప్రతీకారంగానే వైసీపీ వెన్నుపోటు దినం
ABN , Publish Date - Jun 04 , 2025 | 06:39 AM
జగన్ నిర్వహించిన వెన్నుపోటు దినం ప్రజలపై ప్రతీకార చర్యగా ఉందని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు విమర్శించారు. సంఘ విద్రోహ శక్తులతో జగన్ సానుభూతి చూపుతున్నారని ఆరోపించారు.

సంఘ విద్రోహ శక్తులకు పరామర్శా..!: రఘురామరాజు
అమరావతి, జూన్ 3(ఆంధ్రజ్యోతి): ‘ప్రజలు వైసీపీకి వెన్నుపోటు పొడిచారని జగన్ భావిస్తున్నారు. అందుకు ప్రతీకారంగానే ఆయన వెన్నుపోటు దినం చేస్తున్నారు’ అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. మంగళవారం అమరావతి అసెంబ్లీలోని తన చాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎవరినీ వెన్నుపోటు పొడవలేదని స్పష్టం చేశారు. ‘నేను ఇంత సంక్షేమం చేసినా ఎందుకు నాకు వెన్నుపోటు పొడిచి, సంక్షోభంలోకి నెట్టారు?’ అన్న ఉద్దేశంతో జగన్ వెన్నుపోటు దినం చేసుకుంటే తప్పు లేదు. రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలుండవు అన్నట్లు.. ఈ రోజు జగన్ ఆత్మహత్య దినం జరుపుకున్నారు. రేపు వెన్నుపోటు దినం చేసుకుంటారు. సంఘ విద్రోహ శక్తులతో, ‘భయపడకు... నీకు నేనున్నాను’ అని జగన్ అనడం దురదృష్టం. జగన్ను చూసి జాలి పడటం కన్నా చేయగలిందేమీ లేదు’ అని రఘురామ తెలిపారు.