APPSC Group 1 Scam: ఆస్పత్రిలో చేరిన పీఎస్ఆర్
ABN , Publish Date - Jun 11 , 2025 | 04:58 AM
ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు ఆస్పత్రిలో చేరారు. రాత్రి ఆయాసం రావడం, మంగళవారం ఉదయం గుండెపోటు వచ్చిందని...

విజయవాడ, జూన్ 10(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు ఆస్పత్రిలో చేరారు. రాత్రి ఆయాసం రావడం, మంగళవారం ఉదయం గుండెపోటు వచ్చిందని చెప్పడంతో జైలు అధికారులు ఆయనను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్లోని కార్డియాలజీ వార్డులో చేర్పించారు. నలుగురు వైద్యుల బృందం ఆయనను పరీక్షిస్తోంది. ఈసీజీ, ఎకో 2డీ, బీపీ, షుగర్ పరీక్షలు చేశారు. 24 గంటల పాటు పరిశీలనలో ఉంచాలని జైలు సిబ్బందికి వైద్యులు సూచించారు. ఇదిలాఉండగా, అనారోగ్య కారణాల రీత్యా తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పీఎ్సఆర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను న్యాయాధికారి దేవిక బుధవారానికి వాయిదా వేశారు.