మినీ బైపాస్ రోడ్డు నిర్మాణానికి సన్నాహాలు
ABN , Publish Date - Jun 15 , 2025 | 12:52 AM
అద్దంకి పట్టణంలో మినీ బైపాస్ రోడ్డు నిర్మాణానికి సన్నాహాలు ఊపందుకున్నాయి.

అద్దంకి, జూన్14(ఆంధ్రజ్యోతి): అద్దంకి పట్టణంలో మినీ బైపాస్ రోడ్డు నిర్మాణానికి సన్నాహాలు ఊపందుకున్నాయి. కాలువ కట్ట పై తాత్కాలిక నివాసాలు ఉన్న కుటుంబాలకు అద్దంకి కొండ వద్ద శింగరకొండపాలెం సమీ పంలో స్థలాలు కేటాయిస్తున్నారు. ఈ నేప థ్యంలో ప్రతిపాదిత స్థలంలో పెద్ద గోతులు ఉండడంతో చదును చేసే పనులు ప్రారం భమయ్యాయి. విజయవాడ-బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం చేస్తున్న మెగా ఇంజ నీరింగ్ సంస్థ సహకారంతో అద్దంకికొండ వద్ద ఎక్స్కవేటర్, టిప్పర్లను ఉపయోగించి చదును చేస్తున్నారు. అనంతరం రోడ్లు ఏర్పాటు, విద్యుత్ సౌకర్యం, నీటివసతి కల్పించి అభివృద్ధి చేసేందుకు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై చివరి నాటికి కాలువ కట్టపై ఇళ్లు తొలగించే విధంగా పనులు వేగవంతం చేశారు. సుమారు 70 ఇళ్లు ఉన్నట్లు గుర్తించి ఖాళీ చేసి అద్దంకి కొండ వద్ద కేటాయించే స్థలానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఆయా కుటుంబాలకు అధికారులు సమాచారం ఇచ్చారు. రేణింగవరం నుంచి నామ్ రోడ్డు వరకు మధ్యలో కాలువ ఉంచి రెండు వైపులా సిమెంట్ రోడ్లు నిర్మాణం చేయనున్నారు. అదే సమయంలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చే మురుగు నీటి ప్రవాహానికి వీలుగా సైడ్ డ్రైన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి రూ.15 కోట్ల నిధులు కూడా మంజూరయ్యాయి. త్వరలో టెండర్లు కూడా పిలిచేందుకు సిద్ధం చేస్తున్నారు. మినీ బైపాస్ నిర్మాణం పూర్తయితే నామ్ రోడ్డు లో కొంత మేర ట్రాఫిక్ తగ్గి రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గే అవకాశం ఉందని పలువురు అభి ప్రాయపడుతున్నారు.