వరుస చోరీలతో జనం బెంబేలు
ABN , Publish Date - Jun 14 , 2025 | 12:35 AM
కొత్తప ట్నం మండలంలో గత నెల రోజులుగా వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు బెం బేలెత్తుతున్నారు. రొయ్యల చెరువుల వద్ద ఉన్న విద్యుత్ మోటార్లు, నివాసాల వద్ద తాళాలు వేసి ఉన్న మోటార్సైకిళ్ళను రాత్రి వేళల్లో అపహరిం చుకెళుతున్నారు.

పోలీసుల ఉదాశీనత
జోరుగా మోటార్లు, బైక్ల దొంగతనాలు
చోరీ కోసం వచ్చిన ఆటోను పోలీస్స్టేషన్లో అప్పగించిన ఆక్వా రైతులు
కొత్తపట్నం, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): కొత్తప ట్నం మండలంలో గత నెల రోజులుగా వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు బెం బేలెత్తుతున్నారు. రొయ్యల చెరువుల వద్ద ఉన్న విద్యుత్ మోటార్లు, నివాసాల వద్ద తాళాలు వేసి ఉన్న మోటార్సైకిళ్ళను రాత్రి వేళల్లో అపహరిం చుకెళుతున్నారు. ఈ దొంగతనాలపై పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నా వారు స్పందించకపోవ టంతో దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే చో రీలకు తెగబడుతున్నారు. శుక్రవారం కొప్పోలు- అల్లూరు గ్రామాల మధ్య చింతల సమీపంలో అల్లూరు ఎంపీటీసీ శాంతారావు సాగు చేస్తున్న రొయ్యల చెరువుల వద్ద విద్యుత్ మోటార్ను పట్టపగలే అపహరించేందుకు ముగ్గురు దొంగలు యత్నించారు. దీంతో వారిని రైతులు పట్టుకునేం దుకు ప్రయత్నించగా పారిపోయారు. ఈక్రమం లో మోటార్ను తరలించేందుకు దొంగలు ఉ పయోగించిన ఆటోను రైతులు స్వాధీనం చేసు కుని ఒంగోలు సీసీఎస్ పోలీస్స్టేషన్కు అ ప్పగించారు. వారం క్రితం అల్లూరు గ్రామంలోనే ఇంటి ముందు నిలిపిఉంచి మోటార్సైకిల్ను రాత్రికి రాత్రే తీసుకుపోయారు. విచిత్రమేమంటే తమ వద్ద డొక్కు మోటార్సైకిల్ను అక్కడే వది లేసి ఇంటి ముందు ఉన్న కొత్త బైక్ను చోరీ చే శారు. పది రోజుల క్రితం చింతల సమీపంలోని రొయ్యల చెరువుల వద్ద రాత్రి సమయంలో వి ద్యుత్ మోటార్లను చోరీ చేసిన వ్యక్తులు తమ వద్ద ఉన్నపాత మోటార్సైకిల్ను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఇలా ఈ వారం పది రోజుల్లో దా దాపు 10 విద్యుత్ మోటార్లు, ఆక్వా సాగులో ఉప యోగించే ఇతర పరికరాలు చోరీకి గురయ్యాయి. పోలీసులు ఉన్నతాధికారులు స్పందించి దొంగల ఆగడాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.