ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్
ABN , Publish Date - Jun 14 , 2025 | 12:34 AM
విద్యా ర్థులకు సన్నబియ్యంతో భో జనం పెడతానని మాట ఇ చ్చిన విద్యాశాఖ మంత్రి నా రా లోకేష్ పాఠశాలల పు నఃప్రారంభం నుంచి అమ లు చేయడం పట్ల విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రా యపాటి జగదీష్ హర్షం వ్యక్తం చేశారు.

విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్
ఒంగోలు కలెక్టరేట్, జూ న్ 13 (ఆంధ్రజ్యోతి): విద్యా ర్థులకు సన్నబియ్యంతో భో జనం పెడతానని మాట ఇ చ్చిన విద్యాశాఖ మంత్రి నా రా లోకేష్ పాఠశాలల పు నఃప్రారంభం నుంచి అమ లు చేయడం పట్ల విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రా యపాటి జగదీష్ హర్షం వ్యక్తం చేశారు. ఒంగోలులోని మునిసిపల్ హైస్కూ లు, బాలాజీనగర్లోని మునిసిపల్ హైస్కూళ్లను శుక్రవారం ఆయన సంద ర్శించారు. ముందుగా విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలల్లో సమస్యలు, వస తులపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ విద్యార్థులకు మంచి భోజనంతో పాటు ప్రతి శుక్రవారం స్పెషల్ భోజనం పెట్టడం అభినందనీయ న్నారు. బ్యాగులు, పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం మెరుగైన సదుపాయాలను విద్యార్థులకు కల్పి స్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రేమ్కుమార్, కొమ్ము రాజు, గం ధం బెంజిమెన్, ఈస్టర్ కృష్ణ, సూర్య తదితరులు పాల్గొన్నారు.