చేనేతలకు అండగా ప్రభుత్వం : ఎమ్మెల్యే కొండయ్య
ABN , Publish Date - Jun 15 , 2025 | 12:49 AM
చీరాల చేనేతలకు ప్రభుత్వం ఎల్ల ప్పుడు అండగా ఉంటుందని ఎమ్మెల్యే ఎంఎం. కొండయ్య పేర్కొన్నారు.

దేశాయిపేట (చీరాల), జూన్ 14 (ఆంధ్ర జ్యోతి) : చీరాల చేనేతలకు ప్రభుత్వం ఎల్ల ప్పుడు అండగా ఉంటుందని ఎమ్మెల్యే ఎంఎం. కొండయ్య పేర్కొన్నారు. చీరాల కుప్పడం చీరకు జాతీయ గుర్తింపు లభించిన నేపథ్యం లో శనివారం వేటపాలెం మండల పరిధిలోని దేశాయిపేటలో టీడీపీ సీనియర్ నాయకులు సిద్ధి బుచ్చేశ్వరరావు, చేనేతలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మె ల్యే కొండయ్య ముందుగా గ్రామంలోనే మగ్గాలను పరిశీలించి చీర తయారీ విధానా న్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ చేనేత రంగం సంక్షోభంలో ఉండగా పూట గడిచేందుకు నేతన్నలు అవస్థ లు పడినట్లు చెప్పారు. వారిని ఆదుకొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం రంగం తరు వాత అంతటిప్రాధాన్యత కలిగి నది చేనేత రంగమేనన్నారు. ఎట్టి పరిస్థితులలోనూ చేనేత ల చేయి విడిచిపెట్టమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడు సహకారంతో సాధ్యమైనంత వేగంగా హ్యాడ్ లూమ్ పార్కు ఏర్పాటుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అలాగే నేతన్న చీరకు గుర్తింపు వచ్చేందుకు కృషిచేసిన ముఖ్య మంత్రి, ఎమ్మెల్యేలకు చేనేత లు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హ్యాండ్లూమ్ చైర్మన్ సజ్జా హేమలత, ఏఎంసీ చైర్మన్ కౌతవరపు జనార్ధనరావు, చేనేత నాయకులు, కార్మికులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.