Share News

విద్యకు అధిక ప్రాధాన్యం

ABN , Publish Date - Jun 14 , 2025 | 11:08 PM

విద్యకు ప్రభుత్వం అధిక పాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠ శాలలో విద్యను అభ్యసించే పేదింటి విద్యార్థుల కోసం బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించిం దన్నారు.

విద్యకు అధిక ప్రాధాన్యం
జిల్లా పరిషత్‌ పాఠశాల ఏర్పాటు శిలాఫలకాన్ని ఆవిష్కరణలో పాల్గొన్న ఉగ్ర

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

పామూరు, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): విద్యకు ప్రభుత్వం అధిక పాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠ శాలలో విద్యను అభ్యసించే పేదింటి విద్యార్థుల కోసం బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించిం దన్నారు. మండలంలోని నర్రమారెళ్ల గ్రామంలోని పాఠశాలను జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్‌ చేశారు. ఉన్నత పాఠశాల శిలాఫలకాన్ని టీడీపీ మండల అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లుతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర శనివారం ప్రాంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో నర్రమారెళ్లతో పాటు, మోపాడు, పడమటకట్టకిందపల్లి గ్రామాల్లోని ప్రాథమికోన్నత పాఠశాలలు పదో తరగతి పాఠశాలలుగా అప్‌గ్రేడ్‌ చేసినట్టు చెప్పారు. విద్యార్థుల కు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్టు చెప్పారు. సూపర్‌సిక్స్‌ హామీల్లో భాగంగా పాఠశాలలు ప్రారంభం రోజునే ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికివందనం కింద నగదు వేసిన ఘనత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కే దక్కిందన్నారు. ఈ సందర్భంగా విద్యా కిట్లను అందజేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ శ్యామల కాశిరెడ్డి, మాజీ ఎంపీపీ దశరథరామయ్య, జి .శ్రీనువాసులు, ఎంఈవో-1 డీవీ సుబ్బారావు, ఎంపీటీసీ బొల్లా నరసింహారావు, హెచ్‌ఎం షేక్‌ మహబూబ్‌బాషా, ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో స్వామివార్ల శాంతి కల్యాణం

పామూరు, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): పామూరు మండలంలోని నర్రమారెళ్ల గ్రామంలో సీతారామచంద్ర స్వామి తిరునాళ్ళ వేడుకల్లో భాగంగా శనివారం ఆల య అర్చకులు మహంకాళి శివప్రసాద్‌ శర్మ ఆధ్వర్యం లో శాంతి కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించా రు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి ప్రత్యేక పూజలు చేవారు. స్వామివార్లకు గుంటుపల్లి నాగేశ్వరరావు, సుబ్బరాయుడు, బసవయ్య, నాగార్జున ఆర్తిక సహకారంతో వెండీ కిరీటాన్ని బహూ కరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర మాట్లాడు తూ దైవ కార్యక్రమాలను అందరూ కలిసిమెలసి జరుపుకోవాలని సూచించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంద ర్భంగా దేవస్థాన నిర్వాహకులు ఉగ్రను స్వా మివార్ల శేషవస్త్రంతో ఘనంగా సత్కరిం చారు.

కార్యక్రమాల్లో టీడీపీ మండల అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ గుంటుపల్లి దశరథరాములు, అడుసుమల్లి ప్రభాకర్‌చౌదరి, ఎంపీటీసీ బొల్లా నరసిం హారావు, జి.శ్రీనువాసులు, ఎం. రమణయ్య, పోకా వినోద్‌, జి.నాగమల్లేశ్వరరావు, గోళ్ల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

మిట్టపాలెంలో..

సీఎస్‌పురం(పామూరు), జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): సీఎస్‌పురం మండలం మిట్టపాలెం గ్రామంలో సీతా రాముల కల్యాణాన్ని శనివారం వైభవంగా నిర్వహిం చారు. ఈసందర్భంగా నారాయణస్వామి దేవస్థానం మాజీ చైర్మన్‌ పాములపాటి మాధవప్రసాద్‌, రమ ణమ్మ దంపతుల ఆధ్వర్యంలో కల్యాణం నిర్వహిం చారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ దారపనేని చంద్రశేఖర్‌, నారాయణస్వామి దేవస్థాన చైర్మన్‌ కొమ్మినేని చినఆదినారాయణ, బి.జయరామిరెడ్డి, తాళ్ల వెంకటసుబ్బయ్య, చలువాది తిరుపతయ్య, తదితరు లు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 11:08 PM