Pawan Kalyan: ఊరి కోసం మాటామంతీ
ABN , First Publish Date - 2025-05-21T03:00:53+05:30 IST
రాష్ట్రంలోని గ్రామీణ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వినేందుకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ "మన ఊరి కోసం మాటామంతీ" పేరుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. మొదటి రోజు శ్రీకాకుళం జిల్లా రావివలస గ్రామ ప్రజలతో టెక్కలిలోని భవానీ థియేటర్ వేదికగా ముచ్చటించనున్నారు.

స్ర్కీన్ గ్రీవెన్స్కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రీకారం
రేపు టెక్కలిలోని భవానీ థియేటర్లో ప్రారంభం
మంగళగిరి నుంచి రావివలస ప్రజలతో మాటామంతీ
వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే వినతుల స్వీకరణ
అమరావతి, మే 20 (ఆంధ్రజ్యోతి): ప్రజలతో మమేకమై, వారి నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించేందుకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక పంథాను ఎంచుకున్నారు. అభిమానుల తాకిడి, భద్రత కారణాల దృష్ట్యా గ్రామీణ ప్రజలతో పూర్తిగా మమేకం కాలేకపోతున్న ఆయన.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒకరోజు ఒక గ్రామంలోని ప్రజలతో ముచ్చటించి, వాళ్ల సమస్యలను వినేందుకు ‘‘మన ఊరి కోసం మాటామంతీ’’ అనే స్ర్కీన్ గ్రీవెన్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గురువారం ప్రారంభంకానున్న ఈ కార్యక్రమంలో తొలుత శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలోని రావివలస గ్రామ ప్రజలతో పవన్ మాట్లాడతారు. దీనికోసం టెక్కలిలోని భవానీ థియేటర్ను వేదికగా ఎంచుకున్నారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి పవన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భవానీ థియేటర్కు వచ్చిన ప్రజలతో మాట్లాడతారు. ఈ కార్యక్రమం కోసం రావివలస నుంచి 290 మందిని ఆహ్వానిస్తారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో పవన్... ప్రజల సమస్యలను వింటారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతోపాటు రాష్ట్రస్థాయి అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలో తాగు, సాగునీరు, రోడ్లు, మురుగుకాల్వలు, ఉపాధి హామీ పథకం, పాఠశాల విద్య, నిరుద్యోగం, చెరువులు తదితర సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు.
నిరంతరాయంగా మాటామంతి...
స్ర్కీన్ గ్రీవెన్స్ ద్వారా ఒక్కోసారి ఒక్కో గ్రామంతో పవన్ కల్యాణ్ మమేకమవుతారని, ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని ఉపముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలతో స్వయంగా ముచ్చటించాలన్న కోరిక పవన్కు బలంగా ఉంది. అయితే భద్రతా కారణాలు, అభిమానుల తాకిడితో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ఒక్కో గ్రామ ప్రజలకు ఒకే రోజు ఎక్కువ సమయం కేటాయించేలా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. సినిమా స్ర్కీన్ అయితే లైవ్ వాతావరణం ఉంటుందని ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Tiruvuru Political Clash: తిరువూర్లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్
Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే
Read Latest AP News And Telugu News